Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ మాండలికానికే వన్నెతెచ్చారు. ఉమ్మడి వరంగల్జిల్లాలోనే కాళోజీ తన జీవితాన్ని గడిపారు. ప్రశ్నించేతత్వం, ధిక్కారస్వరం, అందరి గొడవే తన 'గొడవ' అంటూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వివక్షను ఎండగట్టిన ప్రజాకవిగా కాళోజీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాజాగా సెప్టెంబర్ 9న కాళోజీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, రచయితల వేదికలు ఘనంగా జరుపుకున్నాయి. వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వం కూడా అధికారికంగా వీరి జయంతిని నిర్వహించింది. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి 2014 సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్మించతలపెట్టిన కళాక్షేత్రం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. హైదరాబాద్లోని రవీంధ్రభారతి కన్నా మిన్నగా, అధునాతనంగా, సర్వహంగులతో ప్రజలను ఆకర్షించేలా కళాక్షేత్ర భవనాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. 4.5ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని, సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. మూడేండ్ల పాటు బడ్జెట్లో నిధులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకే పనులు జరిగాయి. గతేడాది నుంచి ఎలాంటి పనులు జరగడం లేదు. శంకుస్థాపన సమయంలో రెండేండ్లలోపు కళాక్షేత్రం నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటించారు. ఐదేండ్లు గడిచినా 20శాతం పనులు మాత్రమే పూర్తికావడంతో సాహితీలోకం, రచయితల వేదికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్లో కాళోజీ కళాక్షేత్రానికి నిధులు కేటాయించకపోవడం విచారకరం. ఉమ్మడిజిల్లాకు చెందిన మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాళోజీ జయంతి వరకైనా నిర్మాణం పూర్తిచేయాలని ఓరుగల్లు (వరంగల్) సాహితీలోకం ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేస్తోంది.
- కామిడి సతీష్రెడ్డి,
జయశంకర్భూపాలపల్లిజిల్లా.