Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని సష్టిస్తుందా అనే డౌట్ వస్తుంది. ఎందుకు ఈమాట అనాల్సివస్తుందంటే.. కరోనా పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించేలా చేసింది. రాజకీయ నాయకులు, స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తులు ఒకరేమిటి యావత్ సమాజం వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారి పాదాలు కడుగుతున్నారు. సన్మనాలు చేస్తున్నారు. అన్నిరకాలుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. పారిశుధ్య పనిచేసేవారిలో అధికులు దళిత గిరిజనులు ఉంటారు. వారితో పాటు కొద్దిమంది వెనుకబడ్డ వర్గాలవారు ఉంటారు. పెత్తందారీ అగ్రవర్ణ బ్రాహ్మణ భావజాల ప్రభావం సమాజంపై ఉండడంతో వీరు చీత్కారనికి, అంటరానితనానికి, వివక్షతకు గురయ్యారు. వారిని ముట్టుకోవడానికి వారి పక్కన కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ కరోనా ఎఫెక్ట్తో ఇప్పుడందరికీ వారిమీద ప్రేమ పుట్టుకొచ్చింది. వారికి పాదాభి వందనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ సమాజం చేత చీత్కారానికి గురైన వారు ఇప్పుడు సన్మానాలు అందుకోవడం నిజంగా కరోనా కల్పించిన అవకాశం. సమాజం కండ్లు తెరిపించిన సందర్భం. కరోనా వ్యాధి విస్తరించకుండా అందరూ ఇండ్లలోనే ఉండాలని లాక్డౌన్ ప్రకటించారు. కానీ పారిశుధ్య కార్మికులు మాత్రం వారి విధులను నిర్వహించాలన్నారు. ఎందుకంటే వారుకూడా ఇండ్లకే పరిమితం అయితే నగరాలూ పట్టణాలు చెత్త చెదారంతో నిండిపోతాయి. వ్యర్థపదార్థలన్నీ రోడ్లమీదే ఉంటాయి . దానితో వైరస్ ఎక్కువ విజంభించే అవకాశం ఉంది. అందుకే వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, ప్రాణాలను రక్షించేందుకు కార్మికులు పారిశుధ్య పని చేస్తున్నారు. వీరి త్యాగాలకు కరోనా గుర్తింపు తెచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇదే కరోనా వ్యాధి విస్తరించకూడదంటే సామాజిక దూరం పాటించాలంటుంది. ఈపేరుతో పరోక్షంగా బ్రాహ్మణ భావజాలానికి బలం చేకూరుస్తుంది. శుచి శుభ్రత పేరుతో పాత ఆచారాలు సాంప్రదాయాల ప్రాధాన్యతను పెంచుతున్నది. వ్యాధి విస్తరించకుండా తీసుకునే జాగ్రతల కోసం చెప్పిన సామాజిక దూరం అన్న పదాన్ని ఇప్పుడు మనువాదులు మరోలా వాడుకోవడానికి పరోక్షంగా మను ధర్మశాస్త్రానికి బలం చేకూర్చే అవకాశాన్నికూడా కరోనా కల్పించిందనిపిస్తుంది. జొన్న విత్తుల లాంటి వారు తమ ప్రచారాన్ని మొదలు పెట్టారు. సామాజిక దూరం పాటించాలని శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి వాటిని అమలు చేయకపోడంవలనే కరోనా లాంటి వ్యాధులు విజంభిస్తున్నాయి. ఇప్పటికయినా మన శాస్త్రాలను మనం గౌరవించుకోవాలి. వాటిని పాటిస్తే మంచిది అంటున్నారు. మరికొందరు ఆహార అలవాట్ల గురించి చెబుతూ మాంసాహారం తినడం వలనే వ్యాధులు విస్తరిస్తున్నాయి అంటున్నారు. చర్చంతా సనాతన సాంప్రదాయాల వైపు ఆచారాలవైపు తీసుకెళ్లడానికి కూడా కరోనా అవకాశం కల్పించింది. అందుకే కరోనా వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని సృష్టిస్తోంది అంటున్నాను. ఒకవైపు పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగిస్తోంది, మరోవైపు సామాజిక దూరం పాటించే పేరుతో కొన్ని వర్గాలను సమాజానికి దూరంగా పెట్టె కుట్రకు అవకాశం కల్పిస్తోంది.
సమాజం మేధో శ్రమకు ఇచ్చే విలువను శారీరక శ్రమకు ఇవ్వదు. ఇప్పటికి అదే జరుగుతుంది. సమాజ పురోభివద్ధికి రెండు అవసరమే. కానీ సమాజాన్ని తిరోగమన దిశకు నడిపించే శక్తులు, శాస్త్రాలు మాత్రం మేధో శ్రమ మాత్రమే గొప్పదన్న భావనను ముందుకు తెచ్చాయి. మానవ సమాజ పరిణామ క్రమంలో ప్రకతి మీద ఆధిపత్యం కోసం మానవుడు చేస్తున్న పోరాటంలో భాగంగా ఒక పద్ధతి ప్రకారం మేధో శ్రమ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సమాజాన్ని పురోభివద్ధి వైపు నడపాలంటే మేధో శ్రమ అవసరం, ప్రకతిని కట్టడి చేయాలంటే తెలివి కావాలి అనే పేరుతో శారీరక శ్రమ చేసేవారిని తక్కువచేసే విధంగా శాస్త్రాలలో చెప్పే ప్రయత్నం చేశారు. వానరుడి నుంచి నరుడు వచ్చాడు. వానర మూకకు లేని కులం మానవ సమూహానికి వచ్చింది. మానవ సమాజ పరిణామ క్రమంలో ఎప్పుడు కులం వచ్చింది. ఎందుకు వచ్చింది. శ్రమ విలువను ఎప్పుడు గుర్తించారు. శారీరక శ్రమకు విలువ తక్కువ అనే భావన ఎందుకు తెచ్చారు అనే దాని మీద అనేక చర్చలు జరిగాయి. అంతిమంగా అర్థమైనది ఏమిటంటే ఎటువంటి శ్రమ లేకుండా ఉత్పత్తి ఫలాలను అనుభవిస్తున్న వర్గం శారీరక శ్రమ చేసే వారిని కులాల పేరుతో విడగొట్టి శారీరక శ్రమకు విలువ లేదనే భావనను ముందుకు తెచ్చారని తేలింది. ఈ భావజాలంపై అనేకమంది పోరాటం చేసారు. ఇది తప్పుడు భావజాలం అని తేల్చి చెప్పారు. అయినా ఇంకా ఆ భావజాల పెత్తనం కొనసాగుతోంది. సమాజానికి శారీరక శ్రమ చేసే పారిశుధ్య కార్మికుల అవసరం ఎంతవుందో మేధో శ్రమ చేసే డాక్టర్స్ అవసరం కూడా అంతే ఉందని చెబుతుంది. అలాగే సామాజిక దూరం అనేపేరుతో బూజుపట్టిన భావజాలానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. సమాజం మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టాలి. అదే సమాజ పురోభివద్ధికి దోహదపడుతుంది.
పి.వి.శ్రీనివాసరావు
సెల్: 9553955396