Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామచంద్ర మోరె భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విశిష్ట నాయకుడిగా నిలిచాడు. ఆయన రాసిన ''ఒక దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు'' అనే ఈ పుస్తకం నేటి కాలపు అవసరా లను తీర్చడానికి ఉపకరిస్తుంది. దళిత, వామపక్ష ఉద్యమాలు ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం నేడు మన ముందున్న వేళ.. ఒక చారిత్రక అవసరాన్ని ఈ పుస్తకం పూర్తి చేస్తుంది.
నేడు కేంద్రంలోనూ.. అనేక రాష్ట్రాలలో మనువాద ప్రభుత్వాలు కొలువుతీరి ఉన్నవి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూలదోసి.. మనుస్మతిని రాజ్యాంగంగా ప్రతిష్టించాలని మనువాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజునే అంబేద్కర్ మనుమడు.. దళిత మేధావి ఆనంద్ తెల్తుంబ్డేను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. కుల - వర్గ పోరాటాలు ఐక్యంగా కొనసాగాలని తెల్తుంబ్డే తన రచనల ద్వారా ప్రచారం చేయడమే మనువాద ప్రభుత్వాలకు కంటగింపుగా మారింది. భీమా కోరేగావ్లో జరిగిన దళితుల సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. రెండువందల ఏండ్ల క్రితం జరిగిన భీమా కోరేగావ్ పోరాటం దళితుల ఆత్మగౌరవ పతాకం. మహౌన్నత భీమా కోరేగావ్ వారసత్వాన్ని దళితులకు దక్కకుండా చేయడమే బీజేపీ ప్రభుత్వం పన్నాగంలో అసలు ఉద్దేశం.
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో 1903లో మోరె జన్మించాడు. నాడు బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన మహర్లు కొంత చైతన్యాన్ని సంతరించుకున్న కారణంగానే.. మహాత్మ ఫూలే, సాహుజీ మహారాజ్ల ఉద్యమాల్లో వారు భాగస్వాములయ్యారు. నాటి బ్రాహ్మణీయ శక్తుల ఒత్తిడి కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం మహర్ రెజిమెంట్ని రద్దు చేసింది. ఈ చర్యకు వ్యతిరేకంగా నాడు మహర్లు పెద్ద ఎత్తున ఉద్యమించే క్రమంలో పోరాటపటిమను సంతరించుకున్నారు. ఈ నేపథ్యమే రామచంద్ర మోరెకు చిన్ననాటి నుంచి మనువాద అన్యాయా లకు వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తినిచ్చింది. బొంబాయి మహానగరంలో మిల్లు కార్మికుడిగా చేరి కార్మికుల హక్కుల కోసం పోరాడే క్రమంలోనే మోరెకు అంబేద్కర్తో పరిచయం ఏర్పడింది. రామచంద్ర మోరె మహద్ ప్రాంతం లోని దళితులపై అగ్రకులాల వారు చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొనే దిశలో ఉద్యమాలు చేపట్టా డు. అందులో భాగంగానే ఆయన నాయకత్వంలో ఏర్పడిన ''కొంకణస్థ మహర్ సేవా సంఫ్ు'' ఆధ్వర్యంలో బహిష్కతుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రావాలం టూ మోరె పట్టుబట్టి అంబేద్కర్ను మహద్ తీసుకొచ్చాడు. సమ్మేళనం విజయవంతం కావడం తో దళితులలో వెల్లువెత్తిన నూతన చైతన్యం మహద్ చెరువు నీళ్ళ పోరాటానికి దారి తీసింది. ఆ పోరాటంలో భాగంగానే 1927 డిసెంబర్ 25న.. అంబేద్కర్, మోరె, బాపూ సాహెబ్ సహస్ర బుద్ధేల నాయకత్వంలో మనుస్మతి దహనం చేసి.. భారతదేశ సామాజిక న్యాయ ఉద్యమచరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ముంబాయిలో మిల్లు కార్మికుల పోరాటాల్లో పాలుపంచుకునే క్రమంలోనే మోరెకు సామ్యవాద సిద్ధాంతం గురించి పరిచయం ఏర్పడింది. 1930లో.. మార్క్స్, ఎంగెల్సు రచించిన ''కమ్యూనిస్టు ప్రణాళిక''ను చదివాడు. తాను కోరుకున్న దళితుల విముక్తితో పాటు.. మొత్తం సమాజానికి మేలు జరగాలంటే కమ్యూనిజమే సరైన సాధనమని ఆయన గుర్తించాడు. సామ్యవాద వ్యవస్థ స్థాపనకై పాటుపడడం ద్వారానే.. తాను పుట్టి పెరిగిన దళిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలమని ఆయన గుర్తించాడు. కుల పీడనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను.. వర్గ పీడనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలతో జత కలిపి ముందుకు సాగడమే తన జీవితాశయంగా ఆయన మలుచుకున్నాడు. పేదల్లో అత్యంత పేదలు దళితులే.. పీడనకు గురవుతున్న వారిలో అధిక శాతం దళితులే.. దళితులలో మెజారిటీ శ్రామికులే. అలాంటప్పుడు దళిత సమస్యకు పరిష్కారం కమ్యూనిజం ద్వారానే సిద్ధిస్తుందని దఢ నిశ్చయానికి వచ్చిన మోరె.. నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. కమ్యూనిస్టు పార్టీలో చేరాలనే తన నిర్ణయం గురించి అంబేద్కర్తో చర్చించాడు. అంబేద్కర్ మోరెకు అడ్డుచెప్పలేదు.
కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా బొంబాయి నగరంలో జరిగిన అన్ని శ్రామికవర్గ పోరాటాలలో మోరె అగ్రభాగాన నిలిచి ఉద్యమాలను నడిపాడు. ఆ సందర్భంలోనే దుర్భర దారిద్య్రాన్ని అయన, ఆయన కుటుంబ సభ్యులూ అనుభవించాల్సి వచ్చింది. ధనిక స్వాముల దౌర్జన్యాలను ఎదిరించిన నేరానికి.. ఎన్నోమార్లు ఆయన జైలు పాలు కావలసి వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు.. ఏ ఆసరాలేని ఆయన భార్యాపిల్లలు ఎల్ఫిన్ స్టన్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బతకాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలే చేతనైనంత మేరకు ఆయన కుటుంబాన్ని ఆదుకునేవారు.
దళిత ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి మధ్య వారధిగా రామచంద్ర మోరే జీవితాంతం నిలిచాడు. నాటి కాలపు కమ్యూనిస్టు దిగ్గజం బీ.టీ. రణదివే సైతం.. దళిత - వామపక్ష ఉద్యమాల ఐక్యతను కోరుకున్నారు. కమ్యూనల్ అవార్డు కోసం అంబేద్కర్ పోరాటం చేస్తున్నప్పుడు.. రణదివె ఆయనకు మద్దతుగా నిలిచాడు. సామాజిక న్యాయ పోరాటాలలో పాల్గొన్న కారణంగానే.. దోపిడీకి గురైన వర్గాలను కలుపుకుని పోవడం వలననే.. ఆయా రాష్ట్రాలలో కమ్యూనిస్టుల బలం పెరిగిందంటూ మోరె పార్టీ వేదికల మీద వాదిస్తుంటే వాడు. ఆదివాసీలకు మద్దతుగా త్రిపురలో కమ్యూనిస్టులు జరిపిన పోరాటం అక్కడ పార్టీ బలోపేతానికి దోహద పడిందని.. కేరళలోనూ సామాజిక న్యాయ ఉద్యమాల వారసత్వాన్ని కొనసాగించిన కారణంగా కమ్యూనిస్టుల బలం పెరిగిందంటూ ఆయన వివరించేవాడు.
నేడు తమిళనాడు అంటచబిలీటీ ఎరాడికేషన్ ఫ్రంట్ (ుచీఖజుఖీ) అండతో తమిళనాడులో దళితులు సామాజిక న్యాయ పోరాటాన్ని దఢంగా కొనసాగిస్తున్నారు. కేరళలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాసంఘాల నాయకత్వంలో.. దళితులు ఇతర ప్రజాస్వామిక శక్తులు కలిసి సామాజిక న్యాయం కోసం ఐక్య పోరాటం చేస్తున్నారు. దళిత శోషణ్ ముక్తి మంచ్ (ణూవీవీ) నాయకత్వంలో ఉత్తరాది రాష్ట్రాలలోను కుల వివక్షకు వ్యతిరేకంగా.. బహుజనుల హక్కుల కోసం మిలిటెంట్ పోరాటాలు కొనసాగుతున్నాయి.
కానీ కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీ మనువాద ప్రభుత్వం దళిత హక్కులను కాలరాసే దిశలో అడుగులు వేస్తున్నది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టాన్ని బలహీనపరిచే దిశలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పుడు.. దేశవ్యాప్తంగా దళిత బిడ్డలందరూ పెద్దయెత్తున పోరాటాలు చేయాల్సి వచ్చింది. దానితో దిగొచ్చిన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టానికి రక్షణనిస్తూ పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకు రావాల్సి వచ్చింది. రిజర్వేషన్ విధానాన్ని బలహీన పరిచేదిశలో సైతం కోర్టుల నుంచి తీర్పు లు వస్తున్నాయి. దళిత బిడ్డలకు విద్యావకాశాలు దక్కకుండా చేసేందుకు కుట్రలు నడుస్తు న్నాయి. రిజర్వేషన్లను ఎత్తివేయకుండానే.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా దళితు లకు ఉద్యోగావకాశాలు దక్కకుండా చేస్తున్నారు.
మనువాద - మతోన్మాద శక్తులు నేడు మరింత బలం పెంచుకుంటూ.. అంబేద్కర్ మహనీయుడు సష్టించిన రాజ్యాంగ యంత్రాన్ని క్రమక్రమంగా కబళించడానికి యత్నిస్తున్న వేళ.. శ్రామికుల హక్కుల కోసం జరిగే పోరాటం, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. లాల్ - నీల్ ఐక్యత అనేది నేటి కాలపు అవసరంగా ముందుకొచ్చింది. ఈ రోజున విడుదల అవుతున్న ఈ పుస్తక రూపంలోనున్న మోరె జీవితానుభవాలు.. ఈ ఐక్యతను ఎలా నిర్మించాలో మనకు తెలుపుతాయి. కామ్రేడ్ మోరె విశిష్ట జీవితమూ.. ఆయన పోరాటాలు.. ఆయన రచనలు సైతం ఈ ఐక్యతా సందేశాన్ని మనకు అందిస్తాయి. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా.. ఆయనిచ్చిన ఐక్యతా సందేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ దిశలో మనం ముందడుగు వేయాలి. మోరె జీవితాంతం కాంక్షించిన ఆశయాలను మనం నెరవేర్చగలిగితే.. భారతదేశంలో వెల్లువెత్తిన విముక్తి ఉద్యమాల సారాంశాన్ని మనం అమలులో పెట్టగలం. ఆ దిశలో ముందుకు సాగడమే మోరెకు మనం అందించగలిగే నిజమైన నివాళి అవుతుంది.
స్వేచ్ఛానువాదం : ఆర్. రాజేశమ్
సుభాషిణి అలీ
సెల్: 9440443183