Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2001లో అమెరికాలోనే ఎన్రాన్ దివాళా తీసింది. ''వంద బర్రెలు తిన్న రాబందు తుఫానుకి కొట్టుకు పోయినట్టు!'' ఆ విధంగా ఎంఎస్ఈబీ బతికింది. మహారాష్ట్ర బతికింది. భారతదేశమూ బతికింది. కాంగ్రెస్వారు అనుమతించిన మొదటి దశ, బీజేపీ వారు అనుమతించిన రెండవదశ నిర్మాణం జంగుపట్టే దశకి చేరింది. ఇప్పుడు రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రయివేట్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, గెయిల్, ఎన్టీపీసీల జాయింట్ వెంచ్ ఎన్రాన్ని టేకోవర్ చేసి నడిపే ప్రయత్నంలో ఉన్నాయి.
''బండెడు అబద్ధం కంటే చిటికెడు సత్యం
కలిపిన అబద్ధం ఎక్కువ ప్రమాదకరం'' అంటారు ప్రముఖ రష్యన్ రచయిత దోస్తావ్ స్కీ.
'వాళ్ళు' నరుక్కొచ్చిన చోటు నుంచే మన ప్రయాణం ప్రారంభిస్తే విషయం స్పష్టమవుతుంది. దానికంటే ముందు 1950-1990 మధ్య జరిగిన విద్యుత్రంగ అభివృద్ధికి సంబంధించి రెండు మాటలు.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) దేశంలో విద్యుత్రంగాన్ని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేసేందుకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ బోర్డులేర్పడ్డాయి. 1975లో ఎన్టీపీసీ, నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ ఏర్పాడ్డాయి. ప్రధానంగా వ్యవసాయక దేశమైన మనదేశం పారిశ్రామికవంతమవ్వాల్సిన అవసరాన్ని గుర్తెరిగిన ఆనాటి ప్లానింగ్ కమిషన్ చేసిన కృషి వల్ల 1950-1990 మధ్య ఉత్పత్తి సామర్థ్యం 38 రెట్లు పెరిగింది. వ్యవసాయ వినియోగం పెరిగింది. మొత్తం మీద తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి ప్రధాన కారణం 1974-84 మధ్య కేంద్ర విద్యుత్ సంస్థలు కూడా వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరగడమే.
1991లో సరళీకృత ఆర్థిక విధానాల రాకతో ఈ అభివృద్ధి నమూనా తలకిందులు చేయబడింది. ఒక సున్నం కలిపిన చేదు మాత్రను దేశంతో మింగించడానికి పైన చెప్పినట్టు దోస్తాన్ స్కీ అవసరమైనాడు. అప్పటికి దేశమంతా పవర్కట్లు సర్వసాధారణం. దీనికి ప్రధాన కారణం 7వ పంచవర్ష ప్రణాళిక నుంచి (1985-1990) విద్యుత్రంగానికి కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ఫలితంగా బీహెచ్ఈఎల్ తన లక్ష్యాలను చేరుకోలేకపోవడం ప్రారంభమైంది. దేశానికవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయాం. పాలకులు ఈ కారణాన్ని దాచిపెట్టి నంగనాచి కబుర్లు చెపుతున్నారు. ఈసాకుతో ప్రయివేటువారికి గెట్లేత్తేశారు. అలా ప్రారంభమైంది నూతన పవర్ పాలసీ.
నూతన విద్యుత్ విధానమంటే ఇది!
విద్యుత్ను ఉత్పత్తిచేసిన వెంటనే వినియోగించాలి. దాన్ని దాచుకోలేం. (డ్రైబ్యాటరీల్లో కొద్ది మొత్తంలో తప్ప!) దీన్నే రివర్స్లో చెప్తే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అర్థమవుతుంది. వినియోగం లేకుంటే విద్యుత్ ఉత్పత్తి చేయలేం. జనరేషన్ స్టేషన్లో ఒక యూనిట్ ఉత్పత్తి చేస్తే మరుక్షణం దాన్ని వినియోగించాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉంటే విద్యుత్ వినియోగం బాగా ఉంటుంది. అప్పుడు విద్యుత్ ఉత్పత్తి బాగా జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ బొగ్గును గాని, సహజవాయువును మండించడం ద్వారాగానీ ఉత్పత్తి చేసేవే. మనదేశంలో దొరికే నాణ్యమైన బొగ్గు ఒక కిలోగ్రాము (కేజీ) పూర్తిగా మండిస్తే 3.5 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరగాలి. కానీ ప్రస్తుతం 1.25 యూనిట్లే ఉత్పత్తి అవుతోంది. అందుకే మన థర్మల్ విద్యుత్ సామర్థ్యం 40శాతమే. మొత్తం దేశంలో ఉన్న విద్యుత్ సామర్థ్యం 2019 జూలై 31 (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) 3,70,000 మెగావాట్లు. అదే రోజుకు దేశంలో పీక్లోడ్ డిమాండ్ 1,92,000 మె.వా. దాదాపు ఇదే పరిస్థితి 1991లో కూడా ఉంది. దీనికి మందు వేయకుండా మన ''సంస్కరణ వాదుల్ని'' (ఆనాటి కాంగ్రెస్ ప్రభువుల్ని) అడ్డుకున్నదేమిటి? ప్రపంచ విద్యుత్ ఉత్పత్తి యంత్రాల మార్కెట్ ప్రధానంగా ఎబిబి - ఆల్ స్తోమ్, సీమెన్స్, జి.ఇ., హిటాచి, వెస్టింగ్హౌస్ వంటి సంస్థల చేతుల్లో ఉంది. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిమార్కెట్ కుచించుకుపోయింది. దాంతో మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడ్డాయి. ఆ నేపథ్యంలో మన దగ్గర ''నూతన విద్యుత్ విధానం'' వచ్చింది. రెండవది, అతిముఖ్యమైన మరో కారణమేమంటే 'రాజ్య' సహాయం లేనిదే భారతీయ కార్పొరేట్లు మనలేని పరిస్థితి వచ్చింది. 1991 తర్వాత మనదేశంలో రాజ్యం కార్పొరేట్ల కోసం ప్రారంభించిన ''నూతన ఆర్థిక విధానం'', దాన్లోంచి అవదలదాల్చిందే 'నూతన విద్యుత్ విధానం'.
కథ అలా మొదలైంది!
7వ పంచవర్ష ప్రణాళిక నుంచి, మరీ ముఖ్యంగా 8వ ప్రణాళిక నుంచి విద్యుత్ రంగ కేటాయింపులు తగ్గిన విషయాన్ని దాచిపెట్టారు మన పాలకులు. అంటే బీహెచ్ఈఎల్కు సాయమందించడం ఆగిపోయింది. అప్పటి వరకు 47అంత ర్జాతీయ బిడ్డింగుల్లో పాల్గొని విజయం సాధించిన బీహెచ్ఈఎల్ను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా అడ్డు కున్నారు ఇదే పాలకులు. చివరికి మన దేశంలో ప్రతిపాదించిన టి.ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టులూ నేరుగా విదేశీ కంపెనీలకు ఆర్డర్లివ్వడం ద్వారా బీహెచ్ఈఎల్ కడుపు మాడ్చారు. ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీల వాటాల అమ్మకం మొదలైంది. అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమలకు తమ రిజర్వు నిధుల నుంచే అభివృద్ధి చేసుకోవాలని మరింత నష్టపెడుతున్నారు.
అసలు కథ - పవర్కట్లలోకి వద్దాం.. దేశం ఈ పవర్ కట్ల యుగంలోంచి బయటపడాలంటే విద్యుత్ ఉత్పత్తి దండిగా జరగాలని అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు, దేశంలోనూ లేదు కాబట్టి బయట దేశాల నుంచి తెచ్చుకోవాలనే ప్రచారం లంకించుకున్నారు పాలకులు. దీన్నీ అనేక మంది అమాయకంగా నమ్మారు. ఇది లోగుట్టూ కాదు, తెలుసుకోడానికి పెరుమాళ్ళూ (దేవుడు) అవసరం లేదు. విజరు ప్రసాద్, ప్రబీర్ పుర్కాయస్త రాసిన ''ఎన్రాన్ బ్లో అవుట్'' చదివినా, అభరు మెహతా రాసిన ''పవర్ ప్లే'' చదివినా ఒక్క విదేశీ కంపెనీ కోసం బారత పాలకులు ఇంత గడ్డికరుస్తారా?! అనిపిస్తోంది. కానీ ఇది నిజం. మహారాష్ట్ర అసెంబ్లీకి, భారత పార్లమెంటుకు అబద్ధాలు చెప్పారు. ఒట్టేసి మరీ సుప్రీం కోర్టులో అబద్ధాలు చెప్పారు. దేశంలో ఉన్న చట్టాల్ని అతిక్రమించారు.
పి.వి. నర్సింహరావు ప్రభుత్వం కోర్టులో ప్రమాణం చేసి చెప్పిన విషయమేమంటే. ఎన్రాన్ ప్రపంచంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటని! కానీ వాస్తవమేమంటే.. ఎన్రాన్ ప్రధానంగా పెట్రోలియం సరఫరా చేసే కంపెనీ. 1993లో దాని మొత్తం అమ్మకాలు 7.1 బిలియన్ డాలర్లు (ఆ రోజు ధరల్లో 22 వేల కోట్ల రూపాయలు) దాన్లో కేవలం ఒక్కశాతం విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చింది. మన దేశంలోకి ఎన్రాన్ ప్రవేశమే ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో ప్రారంభమైంది.
అప్పటి దాకా మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసింది రాష్ట్రాల విద్యుత్ బోర్డులు, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, ఎన్పీసీ వంటి కేంద్ర సంస్థలు ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్ప ప్రయివేటు ఉత్పత్తి లేదు. ఎన్రాన్ తన భారతీయ సబ్సిడీయరి ధబోల్ పవర్ కార్పొరేషన్ (డీపీసీ) మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఎంఎస్ఈబీ) కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం తక్కువలో తక్కువ 84శాతం నుంచి వందశాతం వరకు. ఎన్రాన్ విద్యుత్ అంతా కొనాలి. ఏ కారణంతోనైనా 83శాతం విద్యుత్ కొన్నా నెలకు 92కోట్ల రూపాయలు చెల్లించాలి. ఎన్రాన్కి చెల్లించే డబ్బు రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి స్థిర చార్జీలు - అంటే విద్యుత్ ఉత్పత్తి యంత్రాల కొనుగోలు, వాటికై చేసిన బ్యాంకు రుణం, దానిపై వడ్డీ, వాటిని తరలించడానికయ్యే ఖర్చు, వాటి ఇన్సూరెన్స్- ఇవన్నీ కలిసి స్థిరచార్జీలు. రెండు అస్థిర చార్జీలు. అంటే దాన్లో వాడే ఇంధనం, దాని రవాణా ఖర్చు బొగ్గు అయితే కోల్ లింకేజి ఖర్చు, రైల్వే వ్యాగన్ల ఖర్చు మొదలైనవి. కొన్నా, కొనకున్నా స్థిర చార్జీలు ఆ యజమానికి చెల్లించాలి. ఎన్రాన్ (డీపీసీ)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎల్.ఎన్.జి.(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. పైగా ఈ ఎల్ఎన్జీని ఓమన్, కతార్ల నుంచి కొనుగోలు చేస్తారు. ముందు ఆ దేశంలో దాన్ని మైనస్ 160 డిగ్రీల వద్ద (ఒక భాగాన్ని) దృవీకరించి ఓడల్లో లోడ్ చేసి సముద్రతీరంలోనే ఉన్న ధబోల్ ప్లాంట్లో మళ్ళీ వాయురూపంలోకి తెచ్చి మన ప్లాంట్ స్టోరేజి ట్యాకర్లలో మళ్లీ మైనస్ 160డిగ్రీల వద్ద ద్రవంగా మార్చి వుంచుతారు. ఈ ఖర్చంతా మనదే సుమండీ!
స్వేచ్ఛా మార్కెట్ అంటే దోపిడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి డీపీసీకి లాభం రాకపోతే?! కనీసం 16శాతం లాభం గ్యారంటీ చేయబడింది. అప్పటిదాక దేశంలో అమల్లో ఉన్న పద్ధతి 3శాతం లాభం (రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ఒఆర్) నిన్న కూడా మన ఆర్థికశాఖ మంత్రి ప్రభుత్వరంగ బ్యాంకులు, పోటీ మనస్తత్వం అంటూ కబుర్లు చెపుతున్నారు. ఏ అంతర్జాతీయ బిడ్డింగులు లేకుండా డీపీసీ ప్రాజెక్టు ఎన్రాన్కు బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వబడింది. ఘనత వహించిన అమెరికా దొరవారు ఆనాడు అడిగిందేమంటే ఎంఎస్ఈబీ తన డబ్బు చెల్లించకపోతే తన పరిస్థితేమిటని? అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం దానికి ''గ్యారంటీ'' ఇచ్చింది. అప్పటికీ సంతృప్తి పడని దొర ''మీ రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు నమ్ముతారు'' కేంద్ర ప్రభుత్వం తనకు ''కౌంటర్ గ్యారంటీ'' ఇవ్వాలన్నాడు. దానికీ ''సై'' అన్నారు మన పాలకులు.
ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఒప్పందం చేసుకుంది ఆనాటి కాంగ్రెస్ నాయకుడు శరద్పవార్. దానికి వ్యతిరేకంగా ''యుద్ధం'' ప్రకటించింది బీజేపీ-శివసేన పార్టీలు. 1993లో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, ఎస్ఎస్ల గెలుపు వెనుక ఎన్రాన్కు వ్యతిరేకంగా వారి డైలాగులు కూడా పనిచేసాయి. వీటన్నింటి పరాకాష్ట ఏమంటే 1996లో 13 రోజుల వాజ్పారు పాలన రెండురోజులు లోక్సభలో జరిగిన చర్చ ఫాలో అయితే కొన్ని అపురూప దృశ్యాలు కనపడతాయి. అంతకు ముందు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్దయాళ్శర్మపై బీజేపీ పోటీ పెట్టి జి.జి.స్వెల్తో సహా బీజేపీ 13 రోజుల పాలనను దుయ్యబట్టారు. రెండవ రోజుకు బీజేపీ అధిష్టానానికి సీన్ అర్థమైపోయింది. భోజన విరామ సమయంలో (బహుశా ఎన్రాన్ కోసమేననుకుంటా) ఎన్రాన్కు కౌంటర్ గ్యారంటీ ఇచ్చే ఫైలుపై సంతకం పెట్టిన తర్వాత ఆయన రాజీనామా చేశాడు. ఎన్రానా మజాకా!? ఎన్రాన్ కేసులో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ప్రస్తుత ఎన్సీపీల చేతులు అవినీతితో మైలపడిపోయాయి. ఆకాలంలో పివి ప్రభుత్వం దేశ ప్రజల ముందు బొంకిన విషయమేమంటే.. అంత డబ్బు మన దేశంలో లేదు కాబట్టి ఎన్రాన్ లాంటి ఎంఎన్సీలను రానిస్తే వాళ్ళు డబ్బు తెస్తారనేది మరో పచ్చి అబద్ధం.
ధాబోల్ ప్లాంట్ (స్టేజ్1 - 148మె.వా.) స్టేజ్2 - (1444 మె.వా) మొత్తం 2192 మె.వా.లకు కలిపి 28,500లక్షల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని ఘనంగా చెప్పుకున్న దాన్లో 20,000 లక్షల డాలర్లు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ వంటి భారతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చిన అప్పు. అంటే మన దేశంలో డబ్బు లేదనడం ఒక తప్పుడు మాటైతే విదేశాల నుంచి పెట్టుబడి తెస్తారనేది మరో బూతుపదం.
ఎన్రాన్ రాకతో లేదా పివి ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుల రాకతో ''ప్యాడింగ్'' అనే ఒక క్రియ తెలుగు వ్యాకరణంలోకి ప్రవేశించింది. అంటే లేని పెట్టుబడి ఉన్నట్టు చూపి ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందటం. వెరసి ఎన్రాన్కు ఇచ్చిన రాయితీలు. పెట్టుబడిపై 16శాతం లాభం గ్యారంటీ. పూర్తి ట్యాక్స్ హాలిడే. మామూలుగా అనుమతించే తరుగుదల (డిప్రీసియేషన్) 3.5శాతం నుంచి ఎన్రాన్కు 8.24శాతం అనుమతి. టారిఫ్లో స్థిర, అస్థిర చార్జీల అనుమతి. ఇందనం దిగుమతికి అనుమతించడం. విదేశీ మారక ద్రవ్యంలో వచ్చే హెచ్చుతగ్గులు లేకుండా గ్యారంటీ ఇవ్వడం.
ఎన్రాన్ ఎంఎస్ఈబీ డబ్బుని పూర్తిగా తినేసి, గ్యారంటీ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలోకి జొరబడింది. ఆ దశలో 2001లో అమెరికాలోనే ఎన్రాన్ దివాళా తీసింది. ''వంద బర్రెలు తిన్న రాబందు తుఫానుకి కొట్టుకు పోయినట్టు!'' ఆ విధంగా ఎంఎస్ఈబీ బతికింది. మహారాష్ట్ర బతికింది. భారతదేశమూ బతికింది. కాంగ్రెస్వారు అనుమతించిన మొదటి దశ, బీజేపీ వారు అనుమతించిన రెండవదశ నిర్మాణం జంగుపట్టే దశకి చేరింది. ఇప్పుడు రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రయివేట్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, గెయిల్, ఎన్టీపీసీల జాయింట్ వెంచ్ ఎన్రాన్ని టేకోవర్ చేసి నడిపే ప్రయత్నంలో ఉన్నాయి.
ఆర్. సుధాభాస్కర్
సెల్: 9490098025