Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల్లో ముగిసినట్టే మనం 21రోజుల్లో వైరస్పై విజయం సాధిస్తామని మోడీ చెప్పిన ప్రకారం 'విజేత'గా కనిపించాలన్న తాపత్రయమే నడిపించింది. ప్రజారోగ్య వ్యవస్థ విస్తరణ, మరింత శక్తివంతం చేయడం ప్రత్యామ్నాయ ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉండాలి. అటువంటి ప్రజారోగ్య వ్యవస్థ కోసం చేసే పోరాటం భారత ప్రజల మౌలిక శ్రేయస్సుకు సంబంధించిన రాజకీయ సమస్యగా ఉంటుంది.
భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పట్ల అంతులేని నిర్లక్ష్యాన్ని, తీవ్రమైన కొరతనూ కోవిడ్-19 మహమ్మారి బహిర్గతం చేసింది. ఇన్ని రోజుల లాక్డౌన్ అనంతరం కూడా ప్రాణాంతక వైరస్ కట్టడికి సంబంధించి మోడీ ప్రభుత్వం ఎటువంటి పాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కోవిడ్ రోగులతో నిండిపోగా చికిత్సకు అవసరమైన సౌకర్యాల పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా ఉంది. హాట్స్పాట్గా మారిన ముంబై లోని ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయస్థితిని కండ్లకు కడుతున్నాయి.
అయినా మోడీ ప్రభుత్వం ఈ వాస్తవ పరిస్థితిని చూడకుండా కండ్లు మూసుకుంటున్నది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టినట్టు తనకు తనే ఆత్మసంతప్తిలో మునిగి తేలుతున్నది. చేయ వలసిన దానికన్నా చాలా చాలా తక్కువ సంఖ్యలో వెయ్యికి 1.8 చొప్పున మాత్రమే పరీక్షలు జరిగాయి. అనుమానిత కేసులను ఐసొలేషన్లో పెట్టడం, వారితో కాంటాక్టులో వున్న వారందరినీ గుర్తించడం చాలా చోట్ల క్రమ పద్ధతిలో జరగలేదు. ఒక్క కేరళ మాత్రమే ఇందుకు చెప్పుకోదగిన మినహాయింపుగా ఉంది. సుదీర్ఘకాలం లాక్డౌన్ అమలు తర్వాతైనా వైరస్ ఏయే ప్రాంతాలలో, ఏమేరకు వ్యాపించిందనే వివరాలేవీ స్పష్టంగా అందుబాటులోలేవు. కోవిడ్-19 మతుల సంఖ్యను బాగా తగ్గించి చూపుతున్నారు. ప్రస్తుతం లక్షకు 0.2మంది మరణించినట్టుగా చెపు తున్నారు. సమాచారం నివేదించే పద్ధతులు సరిగ్గా లేకపోవడం, యంత్రాంగం బలహీనంగా ఉండటం మాత్రమే ఇందుకు కారణంకాదు. పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల విధాన పరమైన తప్పులు కూడా ఇందుకు కారణమైనాయి.
ప్రయివేటు వైద్య వ్యవస్థ ఘోర వైఫల్యాన్నీ, దానికి బొత్తిగా సామాజిక బాధ్యత లోపించడాన్ని కోవిడ్ సంక్షోభం బట్టబయలు చేసింది. ఏవో కొన్ని మినహాయింపులు వున్నప్పటికీ మొత్తం మీద ప్రయివేటురంగం వైరస్పై పోరాడవలసిన సమయంలో తగినట్టు ప్రవర్తించ లేదు. అందుకోసం తన వనరులను వినియోగించ డానికి ముందుకు రాలేదు. ఎందుకంటే మొత్తం ఆస్పత్రులలో 93శాతం ఆస్పత్రులు, 63శాతం పడకలు ప్రయివేటువే. అలాంటి ప్రయివేటు వైద్యరంగం వైరస్పై పోరులో ప్రత్యక్ష పాత్ర తీసుకోకపోవడం చాలా నష్టం చేసింది.
ఇటువంటి పరిస్థితులలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విస్తరించేందు కు కేంద్ర ప్రభుత్వం తక్షణ, నివారణా చర్యలను తీసుకోవాలని ఎవరైనా ఆశిస్తారు. ఇందుకుగాను ప్రజారోగ్యంపై ప్రభుత్వ ఖర్చును యుద్ధ ప్రాతిపదికన గణనీయంగా పెంచాల్సింది. అయితే అలాంటిదేమీ జరగనేలేదు. ప్రధాని ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ మోసపూరితమైనదిగా తేలిపోయింది. జీడీపీలో 10శాతం వెచ్చిస్తామని వాగ్దానం చేసినప్పటికీ వాస్తవంగా కేంద్రం అదనంగా ఖర్చు చేసింది కేవలం 1శాతం మాత్రమే. పైగా, ఈ ప్యాకేజీలో డబ్బు రూపంలో ఆరోగ్యానికి కేటాయించింది రూ.15,000 కోట్లు మాత్రమే. అది కూడా ఏప్రిల్లో ప్రకటించిన తొలి విడత ప్యాకేజీలోని రూ.1.7లక్షల ప్యాకేజీలో భాగమే.
కోవిడ్-19 అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, ఆరోగ్యరంగాన్ని సన్నద్ధం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ 22వ తేదీన రూ.15,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. ఈ మొత్తాన్ని మూడు దశలలో ఉపయోగించా లని నిర్ణయించింది. రూ.7774 కోట్లు తక్షణం ఖర్చు చేయాలని, మిగిలిన మొత్తం ఏడాది నుంచి నాలుగేండ్ల లోపు వ్యవధిలో ఉపయోగించాలని పేర్కొంది. మొదటిదశలో రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు నిధులలోంచి రూ.3,000 కోట్లు అందుతాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మొత్తంలో అందేది చాలా కొద్ది మాత్రమే. ఆరోగ్యం రాష్ట్ర జాబితాకు చెందిన అంశం అనే సాకుతో మహమ్మారిని అదుపులో పెట్టేందుకు చేసే ఖర్చులను రాష్ట్రాలే భరించాలన్నట్టుగా వాటికి కేటాయింపులు అత్యంత స్వల్పంగా జరుగుతున్నాయి.
ప్యాకేజీపై చివరి, అయిదవ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని వాగ్దానాలు చేశారు గాని నిధులకు సంబంధించి ఎటువంటి నిర్దిష్టత లేదు. ఆరోగ్యం మీద ప్రభుత్వ వ్యయం పెంచుతామన్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల కోసం ప్రాథమిక స్థాయిలో పెట్టుబడులు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో అంటువ్యాధులకు సంబంధించిన ఆస్పత్రి విభాగాలు ఉంటాయి (దీనికి కాల పరిమితి లేదు). బ్లాక్ స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేయబడతాయి. ఇవీ ఆమె చెప్పిన వివరాలు.
ఈ మహమ్మారిపై పోరాటంలో కీలకమైన పాఠం నేర్చుకోవడానికి బీజేపీ పాలకులు సిద్ధం కాలేదు. సమర్థవంతమైన, విస్తతమైన ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకతను వారు గుర్తించలేదు. ఆరోగ్యాన్ని ప్రయివేటీకరించే దిశగానే బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. మోడీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యయాన్ని ఎంత మాత్రం పెంచిందో మనం ఇప్పటికే చూశాం. మోడీ 2017లో ప్రవేశపెట్టిన 'జాతీయ ఆరోగ్య విధానం' ప్రజారోగ్యంపై ప్రస్తుత వ్యయం జీడీపీలో 1.15శాతం ఉండగా 2025 నాటికి 2.5శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అయితే జిల్లా ఆస్పత్రుల విస్తరణలో ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం దాని విధానంగా ఉంది, కనుక జిల్లా ఆస్పత్రులలో ఎప్పటికైనా అంటువ్యాధుల విభాగాలంటూ ఏర్పడితే అవి ప్రయివేటీకరించబడిన నమూనాగానే ఉంటాయి.
ఆరోగ్యరంగ నిపుణులు, అంటువ్యాధి ప్రత్యేక వైద్యుల సలహాలను పెడచెవిన పెట్టి... కోవిడ్-19 నిరోధక వ్యూహాన్ని గందరగోళంగా మార్చినందుకు... మోడీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైరస్ అదుపులో ఉందని, అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఈ విషయమై బాగా పని చేస్తోందని నిరంతరం ఒకే పాట వినిపిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందన్న వాస్తవాన్ని విస్మరించింది. తక్కువ చేసి చూపేందుకు తంటాలు పడింది. వీటన్నిటి కారణంగా లాక్డౌన్ ఎత్తివేశాక కేసుల పెరుగుదలను ఎదుర్కోగల సత్తా, సంసిద్ధత లేకుండా పోయాయి. మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల్లో ముగిసినట్టే మనం 21రోజుల్లో వైరస్పై విజయం సాధిస్తామని మోడీ చెప్పిన ప్రకారం 'విజేత'గా కనిపించాలన్న తాపత్రయమే నడిపించింది.ప్రజారోగ్య వ్యవస్థ విస్తరణ, మరింత శక్తివంతం చేయడం ప్రత్యామ్నాయ ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉండాలి. అటువంటి ప్రజారోగ్య వ్యవస్థ కోసం చేసే పోరాటం భారత ప్రజల మౌలిక శ్రేయస్సుకు సంబంధించిన రాజకీయ సమస్యగా ఉంటుంది.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం