Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి ప్రజావాహినికి ప్రాతినిథ్యం వహించేటప్పుడు ఆత్మ నేయంగా తనకుతానే కవిత్వీకరించుకోవడం కనిపిస్తోంది. సామాజికులను కదిలించే కవులే నిజమైన ప్రజా ప్రతినిధులు. పరోక్షంగా ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పోరాడే లక్షణం వారికే ఉంటుంది. మానవ జాతి మనుగడకు ప్రాణం పోసేవాడే కవి. అణచివేతకు గురైనవారి కోసం, హక్కులు కోల్పోయినవారి కోసం, అన్నదాతల కోసం కలం కదిలించి ప్రగతి పథంవైపు మళ్లించేవారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో కవి శేషేంద్రశర్మను పేర్కొనాలి. ఆయన కవిసేన మేనిఫెస్టోలోనే ఆయన ప్రజల ప్రాతినిధ్యం కనిపించింది. అది 'నాదేశం నాప్రజల'ని చాటడంలోనే ప్రతిఫలించింది. ప్రజా పోరాటాలను అక్షరీకరించి తర్వాతి కవులకు ఆయన మార్గదర్శకులు అయినారు.
అభ్యుదయకరమైన సజనశీలత కలిగినవారే కవులుగా రాణిస్తారు. సమాజం వ్యక్తిలో నిక్షిప్తమై ఉంటే, సమాజంలో ప్రక్షిప్తమై ఉంటాడు కవి. అయితే సమాజంతో ఉంటూ సామాజికానుభవంతో ఎదిగివచ్చి సాహిత్య కషి చేసిన కవి శేషేంద్ర శర్మ. కవిత్వంలో సాంద్రత, భావంలో గాఢత, శైలిలో ఆధునికత ఆయన స్వంతం. సమకాలీన కవుల్లో ఎవరిలోనూ కని పించని విలక్షణమైన కవన సష్టి ఆయనలో కనిపిస్తుంది. పదునెక్కించే పదజాలం ఆయన విలక్షణతను పెంచింది. శబ్దం ఆయన ఊపిరి. శబ్దం ఆయన శక్తి. సజనను శాశ్వతం చేసేది శబ్ద శక్తి మాత్రమే. ప్రకతిని వర్ణించే టప్పుడు ఆయన పద జాలం శేషేంద్ర జాలంలా భాసించింది.
''భూమి శూన్యంలో తిరిగే బొంగరం, ఆకాశపు ఆలోచనల్లో చంద్రుడు కన్నీటి చుక్క,
నిశ్శబ్దపు సాలె గూడులో ఈగలా చరిస్తుంది కాలం, మండే సూర్యుడు'... అలాగే
'వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాది కొక వసంతమన్నా దక్కేది' అనడంలో అంతులేని ఆవేదన కానవస్తుంది.
లాలిత్యంతో నిదురించే తోటలోకి పాటను పంపించి రసానుభూతిని కలిగించిన ప్రతిభ ఆయనది. అందుకే 'నా శబ్ద అయస్కాంతశక్తి పాఠకున్ని ఆకర్షించి అతని మనసును మార్చడమే' తనధ్యేయ మన్నారు. ఆయన కవితా సష్టి మనిషిని చెక్కిన శిల్పంలా ఉంటుంది. సమకాలీనంగా తెలుగు సాహిత్యంలో నెలకొన్న కళా రాహిత్యాన్ని ఆయన ప్రతిఘటించారు.
మానవ నాగరికతా పరిణామంలో నాగలి పాత్రను విస్మరించలేం. ఆధునిక కవిత్వంలో మట్టివాసనను పులుముకున్న వస్తువే ఎక్కువ. మట్టి స్పర్శ లేనిదే సజన స్పర్శ రాణించదు. కర్షకునితో రక్తదఘ్నం ఏర్పర్చుకోని కవి మనలేడు. చంద్రునికి వెన్నెలలా మట్టిని వీడని బంధం శేషేంద్రది. సింధువంత చరిత్ర రైతుకుందని నమ్మిన కవి కాబట్టే ప్రతీకగా
'మనిషిని చెక్కిన శిల్పిని' అన్నాడు. వ్యవసాయంలో నాగలిని అపూర్వంగా వర్ణించిన తీరును గమనించండి.
''నీవొక కర్ర ముక్కవే కావొచ్చు కానీ, అనాది సష్టిలో తలయెత్తిన మానవ మహా కషికి
ఏకైక చిహ్నానివి... ఆకాశమునుంచి భూగోళం మీదికి, రాలిన మండే అక్షరానివి. స్పర్శ మట్టిలో
నిద్రిస్తున్న కలల పరిమాళాల్ని మేల్కొల్పి'' అంటూ శిల్పించిన ప్రగతి శీల కవి. అంతటితో ఆగక...
''..సుఖాలు నిర్మిస్తూ డుఃఖాతాల దండలు వేసుకొన్న, శ్రామిక కోట్ల అడుగులు ఈ నేలలో వెదుకుదాం పదండి
మన నాగళ్లను తగిలే ఆ కోట్లాది గొంతుకల్ని ఏరుకొందాం పదండి'' అంటూ చైతన్యాన్ని నింపారు. ధరిత్రిని హలం దున్నితే దేశమనీ, కలం దున్నితే అది ఒక ఇతిహాసమనీ, ఈ రెండు సంభవించకపోతే అది ఉత్త మట్టేనని ఉత్పత్తికి నిర్వచనం చెప్పిన కవి ఆయన.
జిజ్ఞాసి, స్వాప్నికుడు, తాత్వికుడు అద్భుత సజనకారుడు శేషేంద్రశర్మ. ప్రజల సమస్యలను వదిలేసి హదయ సంబంధ మైన కవిత్వాన్ని వెలువరిస్తూ పాత పాటలనే ఆలపిస్తున్న తరుణంలో ఆయన పదం పల్లవించింది. ఆధునిక కవిత్వం ప్రజాకర్షణకు దూరమవుతున్నదనీ అదే జరిగితే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాడు శేషేంద్ర కవి.
'కాలాన్ని నా కాగితం చేసుకొంటే చేసుకొంటా.. దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా.. దానికింద నా ఊపిరితో సంతకం చేస్తా'నంటూ ప్రకటించుకున్నాడు.
విమర్శకు నికషోపలం పట్టింది కవిసేన మేనిఫెస్టో. నవ్య విమర్శనా భావంతో నూతన సిద్ధాంతానికి రూప కల్పనే ఈ కవిసేన మేనిఫెస్టో అని చెప్పాలి. ఆంధ్ర, ఆంగ్లభాషా పరిజ్ఞానంతో పాచ్య, పాశ్చాత్య విమర్శనా సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకొని, ఆయన ఉత్తమ విమర్శని వెలువరించి తన స్థానాన్ని సుస్థిర పర్చుకొన్నారు. ఆయన విమర్శనా పటిమను గుర్తించి ఆయన విమర్శనా గ్రంథం కాలరేఖకు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డునిచ్చి సత్కరించింది. కళాత్మక విమర్శ 'కాలరేఖ'. ఆయన వెలువరించిన12 విమర్శనా గ్రంథాల్లో నరుడు-నక్షత్రాలు, స్వర్ణ హంస, షోడశి, సాహిత్య కౌముది, రక్తరేఖ, కవిసేన మేనిఫెస్టో, కాలరేఖలు, ఈ నగరం జాబిల్లి, సాహిత్య వ్యాసావళి, విశ్వ వివేచన, ఊహలు అందరి మన్ననలు పొందాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
శేషేంద్ర కవిని అర్థం చేసుకోవాలంటే తూచే తాత్విక తరాజులు మనవద్దలేవు. కానీ కొందరు అంతర్జాతీయ కవుల భావనే ఆయనలో ద్యోతకమవుతొంది. ఇది మోడర్న్ యుగమని మనం అంగీకరించినప్పుడు ఈ తాత్వికతను కూడా సమ్మతించాలి. సామాన్యంగా మనిషికి రెండు తాత్వికతలు, ఒక దేహం ఉంటాయి. చైతన్యాల్లో మొదటిది జాగీరుదావస్థ. రెండోది స్వప్నావస్థ. ఈ మూడు ఒక్కటైనప్పుడే కవిత్వం పుడుతుంది. ఆ రెండూ మనస్సులు దేశంతో ఒకటయ్యే అనుభవం జీవితంలో సతతం సిద్దిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తీకరించలేక పోతారు. అయితే ఆ సమగ్ర క్షణాల కోసం తమ అనురాగంలోనో, ఆధ్యాత్మికంలోనో అన్వేషిస్తారు. ఈ కవికూడా అందుకు భిన్నంగా ఏమీ కనిపించడు. అదీ ఆయన గొప్పతనం
1927 అక్టోబర్ 20న నెల్లూరుజిల్లా ఉదయగిరి తాలూకాలోని నాగరాజుపాడులో జన్మించిన శేషేంద్రశర్మ
తాత్విక స్పహను అందించి మనకు తెలియకుండానే 30 మే 2007 నాడు భౌతికంగా దూరమైనాడు.
- ప్రొ. ననుమాసస్వామి, సెల్: 7013763438