Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ఆరోగ్యరంగంలో కరోనా మహమ్మారి సష్టించిన భీతావహ సంక్షోభాన్ని చూస్తున్నాం. దీనితోపాటు యజమానులు కార్మికులను నడిరోడ్డుకు బలిచేసిన మరో భయంకర విషాదాన్ని చూస్తున్నాం. యజమానులు మాత్రమే కాదు, దేశపాలనా యంత్రాంగం కూడా ఇదే చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు, 2005ని అడ్డం పెట్టుకుని సొంత ఊళ్ళకు వెళ్ళే హక్కును కార్మికులకు లేకుండా చేస్తున్నారు. ఇలా నిలబడిపోయిన కార్మికులకు ఆహారం, నిలువనీడ కరువయ్యాయి. వారి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకున్నవారు లేరు. జీతాలు ఇస్తారన్న గ్యారంటీ లేదు. ప్రభుత్వం అందించే నగదు, ఆహార సదుపాయాలు అనేకమంది కార్మికులకు అందలేదు.
ఆకలితో నకనకలాడుతూ పొట్ట చేతబట్టుకుని లక్షలాది మంది కార్మికులు సొంతవూళ్ళకు తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో అనేకమంది చనిపోయారు. ఇలా నెలరోజులు గడిచిన అనంతరం కేంద్రం వీరు సొంత రాష్ట్రాలకు వెళ్ళటానికి అనుమతిస్తూ అస్పష్టమైన ఆదేశాలు విడుదల చేసింది. ఆ వెంటనే యాజమాన్య వర్గాలకు చెందిన సంఘాలు కార్మికులు స్వగ్రామాలకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు చేయవలసినంత లాబీయింగ్ చేశాయి. యాజమాన్యాలకు కార్మికుల నిరంతరం అందుబాటులో ఉంచాలనే దష్టితో కార్మికులకు ప్రయాణసౌకర్యం కల్పించటంలో ప్రభుత్వాలు ఆలశ్యం, అలసత్వం చూపాయి.
ఇప్పుడు పెట్టుబడిదారులు కార్మికచట్టాలను ఇంకా ఇంకా సడలించాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధంగా ఉన్న కార్మిక చట్టాలెన్నింటినో ప్రక్కనపెడుతూ ఆర్డినెన్సు ఇచ్చింది. ఈ ఆర్డినెన్సు మూలంగా ప్రసూతి ప్రయోజనాలు, గ్రాట్యుటీ ప్రయోజనాలు, 1948 ఫ్యాక్టరీలచట్టం, 1948 కనీసవేతన చట్టం, 1946 ఇండిస్టియల్ ఎస్టాబ్లిష్మెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం, 1926 ట్రేడ్ యూనియన్ చట్టం లాంటి అనేక కార్మికచట్టాలు చట్టుబండలైనాయి. చట్టాలలోని అనేక అంశాలను అమలుచేయటం నుంచి పరిశ్రమలకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చాయి. 12 గంటల షిఫ్ట్ను పారిశ్రామిక యజమానుల సంఘం సీఐఐ సూచించగా, కార్మికులు ఎవరైనా డ్యూటీలో చేరనిపక్షంలో శిక్షలు ఎదుర్కోవాలని చెపుతూ ఫర్మానాలు జారీ చేసాయి.
ఆవిధంగా, అసంఘటితరంగ కార్మికులను గాలికొదిలేసిన తరువాత పెట్టుబడిదారులు స్వేచ్ఛా వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. వీరు సంఘటిత రంగ కార్మికులను కూడా కట్టుబానిసలుగా ఉంచే పద్ధతికావాలని కోరుతున్నారు. దీనివల్ల సంఘటితరంగ కార్మికులకు పార్లమెంటు కల్పించిన రక్షణలన్నీ కొట్టుకు పోతాయి.
వలసకాలం నాటి దోపిడీ
ఇది బ్రిటిష్ పాలనలో బ్రిటిషర్ల కిందవున్న టీ ఎస్టేట్లలో వెట్టికార్మికులుగా పనిచేయించుకోవటానికి తయారుచేసిన 1819నాటి బెంగాల్ రెగ్యులేషన్స్-7ని తలపిస్తున్నది. ఆ చట్టంలో కార్మికులు ఐదేండ్ల కాంట్రాక్టు కింద పనిచేయాలి. మధ్యలో పనివదిలేస్తే శిక్షార్హమౌతుంది. ఆ తరువాత బెంగాల్లో 1863లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ నేటివ్ లేబర్స్ యాక్టు అనే చట్టాన్ని పాస్ చేశారు. దీనివల్ల కార్మికులపై యజమానుల పట్టు బిగియటమేగాక, కార్మికులను బంధించి 6 నెలలు జైలుశిక్ష విధించే అధికారం కూడా దక్కింది. ఆ తరువాత 1865లో బెంగాల్ యాక్టు-6 చేసుకున్నారు. దీని కింద కార్మికులు మధ్యలో పనివదిలి పారిపోకుండా గస్తీ కాయటానికి స్పెషల్ ఇమ్మిగ్రేషన్ పోలీస్ను ఏర్పరిచారు. ఈ పోలీసులు పారిపోయిన కార్మికులను బంధించి, తిరిగి టీ తోటల యజమానులకు అప్పజెపుతారు. 150ఏండ్ల క్రితం బ్రిటిష్ ఇండియా పాలనలో జరిగిన భయానక పరిస్థితులే తిరిగి మన ముందు కదలాడుతున్నాయి.
టీ తోటలలో పనిచేసే కార్మికులే కాదు, ఫ్యాక్టరీ కార్మికులు కూడా తీవ్ర దోపిడీని చవి చూశారు. చిల్లిగవ్వ వేతనానికి రోజుకు 16గంటలు శ్రమించాల్సి వచ్చేది. కార్మికుల ప్రతిఘటనలతో 1911లో ఫ్యాక్టరీస్ చట్టం ఏర్పడింది. ఈ చట్టంతో 12 గంటల పనిదినం ప్రారంభమయినప్పటికీ, తక్కువ మొత్తం జీతాలు, జీతాలలో ఏకపక్షంగా కోతలు, ఇతర కఠిన పని నిబంధనలు కార్మికులను 'రుణ బానిసత్వం'లోకి నెట్టాయి.
కార్మికుల పోరాట ఫలితంగా భారతదేశంలో కార్మిక చట్టాలు ఆవిర్భవించాయి. ఈ పోరాటాలు వలస పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగాయి. మెరుగైన వర్కింగ్ కండిషన్ల కోసం 1920 నుంచి వరుసగా అనేక సమ్మెలు, ఆందోళనలు జరిగాయి. ఆనాడు బ్రిటిష్ ఇండియాలో ఉన్న డిఫెన్సు రూల్స్ క్రింద అనేక మంది కార్మికసంఘ కార్యకర్త లను అరెస్టులు చేశారు. కార్మికుల డిమాండ్లకు ఆనాటి మన రాజకీయ నాయకులు మద్దతు పలికారు. దీని ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితిలో బ్రిటిష్ వారు రాయల్ కమిషన్ ఆఫ్ లేబర్ని నియమించారు. అది తన నివేదికను 1935లో ఇచ్చింది. 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు చట్టాలను రూపొందించటంలో భారతీయులకు అధిక ప్రాతినిధ్యం కలగచేసింది. దీని ఫలితం తరువాత జరిగిన సంస్కరణలలో కనపడి ఈనాటి కార్మికచట్టాలకు మార్గం చూపింది. దిక్కుమొక్కు లేని టీతోటల కార్మికులు 1951 లేబర్ యాక్టు రూపంలో కొంత వెసులుబాటును చూడగలి గారు.
ప్రజాస్వామ్యం వలన శ్రమకు దక్కిన హౌదా
ప్రజాస్వామిక శాసన ప్రక్రియతో కార్మికుల రక్షణకోసం పార్లమెంటు అడుగులు ముందుకు వేసింది. 8గంటల షిప్టులు, ఓవర్ టైంకు వేతనం, వారంలో ఒకరోజు సెలవు, వేతనంతో కూడిన సెలవు, ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు సంభందించిన చర్యలు- ఇవన్నీ ఫ్యాక్టరీస్ యాక్టులో పొందుపరచబడ్డాయి. వేతనాలు, ఇంకా ఇతర వివాదాలకు సంబంధించి సమ్మెలు, లాకౌట్లు, అన్యాయమైన రిట్రెంచిమెంట్లు, డిస్మిసల్స్ తప్పించటం కోసం సంప్రదింపు లలో కార్మికుల భాగస్వామ్యాన్ని ఇండిస్టియల్ డిస్పూట్ యాక్టు కల్పించింది. దిగువస్థాయి వేతనాలు ఇవ్వటాన్ని నిరోధిస్తూ కనీసవేతన చట్టం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల కనుగుణంగా రాజ్యాంగంలోని 21, 23 ఆర్టికల్స్ క్రింద జీవించే హక్కుకు, దోపిడీని వ్యతిరేకించే హక్కుకు అనుకూలంగా ఈ చట్టాలు ఏర్పడ్డాయి. కార్మికులు దాస్యం నుంచి ఒక గౌరవప్రదమైన జీవితానికి పరివర్తన చెందటంలో కార్మిక సంఘాలు కీలకమైన పాత్రను పోషించాయి. సామాజిక-రాజకీయ న్యాయ సాధనలో కార్మిక సంఘాల పాత్ర విస్మరించరానిది.
గ్లాక్సో లేబరేటరీస్కి, ప్రిసైడింగ్ లేబర్ ఆఫీసర్కి మధ్య 1983లో తలెత్తిన వివాదంలో ఇండిస్టియల్ ఎంప్లారు మెంట్(స్టాండింగ్ ఆర్డర్స్)యాక్టు, 1946 గురించి సుప్రీంకోర్టు ఇలా పేర్కొన్నది.. ''స్వేచ్ఛా వాణిజ్యపు రోజులలో పారిశ్రామిక సంబంధాలలో హైర్ అండ్ ఫైర్ లాంటి కఠిన చట్టాలు నడుస్తున్న కాలంలో, యాజమాన్యాలే సూపర్ మాస్టర్లు. యజమానులకు, కార్మికులకు మధ్య ఒడంబడికలు అసమానుల మధ్య జరిగినట్టుండేవి. సామజిక న్యాయం అనే ఆలోచన అభివద్ధి అవుతున్నప్పుడు, సామాజిక-ఆర్ధిక న్యాయ పరిధి విస్తతమవుతున్నప్పుడు పరిశ్రమలలో, పెట్టుబడికి వ్యతిరేకంగా రక్తమాంసాలు వెచ్చించారో అటువంటి అసమాన భాగస్వామికి చట్టరీత్యా రక్షణ కల్పించటం అవసరమైంది.
ఈ చట్టాలు అమలులోలేకుండా చేసే ఏ ప్రయత్నమైనా కార్మికులను శతాబ్దకాలం వెనక్కి తీసుకెళుతుంది. రాజ్యాంగ లక్ష్యాలను దష్టిలో పెట్టుకుని చేసిన ఈ చట్టాల అమలులో కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి ఎటువంటి మినహాయింపులు పార్లమెంటు కల్పించలేదు. ఫ్యాక్టరీస్ యాక్టు సెక్షన్ 5 ద్వారా ''ప్రజలకు ఏర్పడిన ఆత్యయిక'' (ూబbశ్రీఱష జుఎవతీస్త్రవఅషy) పరిస్థితులలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు మినహాయింపులకు అవకాశం ఉంది. ''భారతదేశ భద్రత లేక దేశంలోని ఏ భూభాగమైన ప్రమాదంలో పడినప్పుడు, అది యుద్ధాలవల్లగానీ, లేక విదేశీ దాడుల వల్లగానీ, లేక అంతర్గత కల్లోలాల వల్లగానీ ఈ ఆత్యయిక పరిస్థితి ఏర్పడవచ్చు'' అని 'ప్రజలకు ఏర్పడిన ఆత్యయిక పరిస్థితి' గురించి వివరించటం జరిగింది. అయితే, భారతదేశానికి అటువంటి ప్రమాదమేమీ ఏర్పడలేదు. ప్రజాసంబంధిత సంస్థలకు పనిగంటలలో, సెలవులలో మార్పులు చేయనవసరం లేదు. పారిశ్రామిక వివాద చట్టంలోని 36 (బి) సెక్షన్ ప్రభుత్వ పరిశ్రమలకు ఇన్వెస్టిగేషన్, సెటిల్మెంటుకు సంబంధించిన అంశాలు పొందుపరచబడి ఉన్నప్పుడు మాత్రమే మినహాయింపు నిచ్చింది.
చట్టబద్ద మద్దతు లేదు
కనుక, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఆదేశాలకు చట్టరీత్యా మద్దతు లేదు. రాజ్యాంగం ప్రకారం కార్మికశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. అంతేగాక, కార్మిక చట్టాలకు సంబంధించి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మూడేండ్లు కార్మిక చట్టాల అమలు ఉండదని చెపుతున్నది. వలస కార్మికులు, కనీసవేతనాలు, ప్రసూతి సదుపాయాలు, గ్రాట్యూటి లాంటి ప్రాధమికమైన మానవహక్కులకున్న రక్షణ తొలగించబడింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒక్కదెబ్బతో కేంద్ర ప్రభుత్వ చట్టాలకు విలువలేకుండా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్డినెన్సును దేశాధ్యక్షుడు ఆమోదించటం ద్వారా పార్లమెంటు చేసిన చట్టాలను ఏమాత్రం పనికిరాకుండా చేయటాన్ని మన రాజ్యాంగం ఆమోదించదు.
దాదాపు అన్ని కార్మిక ఒప్పందాలు చట్టం ద్వారా, పరస్పర చర్చల అనంతరం ఒడంబడిక ద్వారా, న్యాయ స్థానాల తీర్పుల ద్వారా- అనగా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా జరుగుతున్నాయి. ఈ పద్ధతులలో కనీసంగానైనా కార్మికులకు యాజమాన్యాలతో సమాన హౌదా ఉంటున్నది. ఇటువంటి పద్దతులు దేశప్రగతికి భరోసానిస్తున్నాయి.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్కి, డి.జె. బహదూర్ అండ్ అదర్స్ మధ్య జరిగిన వివాదంలో (1980), సర్వీస్ కండిషన్లలోని ఏ మార్పయినా ప్రజాస్వామ్య బద్దమైన చర్చలు లేదా చట్టాలు చేయటం ద్వారా జరగాలని న్యాయస్థానం నొక్కిచెప్పింది. జీవిత బీమా కార్మికులకు ప్రభుత్వం ఏక పక్షంగా బోనస్ నిరాకరించటాన్ని తిరస్కరిస్తూ కోర్టు ఇలా అన్నది- ''మౌలికమైన తప్పిదాలను మౌలిక విలువలను గుర్తు పెట్టుకోవటం ద్వారా మాత్రమే జరగకుండా చేయగలం.'' అలాకాని పక్షంలో ''శాసన శూన్యత''(అరాచక) పరిస్థితులు ఏర్పడగలవు.''
రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఆదేశాలు, ఆర్డినెన్సులు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి. కార్మికులకు ఇప్పుడు అమలవుతున్న పని నిబంధనలు కొనసాగనివ్వాలి. వలస పాలనలో విదేశీ కార్పొరేట్ల పుట్టుక జరిగిందనే విషయాన్నీ, వాటి వారసత్వాన్ని స్వాతంత్య్రా నంతరం భారతదేశ పెట్టుబడిదారీ వర్గం పుణికి పుచ్చుకున్నదనే విషయాన్నీ మనం మరవకూడదు. ఇటువంటి వలసకాలం నాటి ఆలోచనా విధానం మన సమాజానికి, కోట్లాదిమంది ప్రజానీకానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇది శ్రామికుల యొక్క ఆరోగ్య, భద్రతలకు చేటు తేవటమే కాక, వారి కుటుంబాలకు హాని కలిగిస్తుంది.
పెట్టుబడికి, శ్రమకి మధ్య బేరసారాల శక్తిలో ఉన్న అసమానతలను సమతుల్యాన్ని నియంత్రణ చట్టాలద్వారా కల్పించాలి. శ్రమకు గౌరవాన్ని కలిగించాలి. న్యాయమైన పద్ధతిలో ఉండటం, పని నిబంధనలలో మానవీయ పరిస్థితులు కల్పించటం, ప్రసూతి ప్రయోజనాలు కలిగించటం ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించిన విధి. ఆర్థిక అవసరాలకోసం కార్మికుల శక్తిని, ఆరోగ్యాన్ని బలి చేయకూడదు. కార్మిక చట్టాలను, నాగరికత లక్ష్యాలను మహమ్మారి కరోనాను సాకుగా తీసుకుని తొక్కివేయరాదు.
- ఆర్.వైగై
- ది హిందూసౌజన్యంతో
స్వేచ్ఛనువాదం: కార్లపాళెం భాస్కర్