Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది కేవలం కార్మిక సంఘాల పోరాటమే కాదు, సామాన్య ప్రజల పోరాటం కూడా. ప్రజల విన్నపాలను ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ 'ఆత్మ నిర్భర్ భారత్' (స్వయం సమద్ధ భారత దేశం) గురించే మాట్లాడుతుంది, కానీ దానికి భిన్నంగా చేస్తుంది. ఒకవేళ అదే బాధ్యతారాహిత్యమైన స్వభావం కొనసాగితే, రానున్న కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేయక తప్పదు.
కోవిడ్-19 మాటున నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపుమేరకు జూలై 3న (రెండు నెలల కాలంలోపు లోనే) రెండవ దేశ వ్యాప్త నిరసన కార్యక్రమం జరిగింది. ఈ విధమైన దేశ వ్యాప్త నిరసన కార్యక్రమం ఒకటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు మే22న నిర్వహించారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వత్తుల్లో పనిచేసే కార్మికులతో పాటు ప్రభుత్వరంగ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగాల్లో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒక లక్ష కేంద్రాల్లో శుక్రవారం నాడు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. కార్మికులు, ప్రజలు బతికేందుకు వారికి ఉన్న కనీస హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి గౌరవం, బాధ్యత లేదని పది కార్మిక సంఘాలు శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆరోపించాయి. కార్మిక సంఘాల ఏర్పాటు హక్కు, సమిష్టిగా బేరమాడే హక్కు, పని ప్రాంతాల్లో తగిన పరిస్థితుల కోసం డిమాండ్ చేసే హక్కు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేసే హక్కు, భవిష్యత్తులో భద్రత పొందే హక్కులను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆ సంఘాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ప్రధాన వ్యూహాత్మక రంగాల్లో వ్యాపారీకరణ, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీగా పాల్గొన్నారు. నిర్ణీత మార్గాలలో ప్రయివేటు కంపెనీలు రైళ్ళు నడిపేందుకు చేస్తున్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామం సమయంలో జాతీయ, ప్రాంతీయ సంఘాలకు చెందిన రైల్వే ఉద్యోగులందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో 'ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్' నాయకత్వంలో రైల్వే గార్డ్స్ అందరూ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో, పంజాబ్ రాష్ట్రంలో కపుర్తలలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలలో కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు.
గత సంవత్సరం ఇదే మార్గంలో ఒక అడుగు ముందుకు వేసిన తరువాత, జూలై 1న భారత రైల్వేశాఖ 109మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు ప్రయివేటు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించినట్టు చెప్పింది. దానిలో భాగంగా రైల్వేల్లో పెట్టుబడుల కోసం మొదటి చర్యగా ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించారు. గత సంవత్సరం అక్టోబర్లో లక్నో- ఢిల్లీ మార్గంలో దేశంలో మొదటి ప్రయివేటు రైలును (తేజాస్ ఎక్స్ప్రెస్) ప్రారంభించారు.
భారతీయ రైల్వేలను ప్రయివేటీకరించే ఎటువంటి చర్యనైనా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తామని దేశంలోనే అత్యంత పెద్ద కార్మిక సంఘం అయిన 'ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్' ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా అన్నాడు. ''నేడు కేంద్ర ప్రభుత్వం యొక్క వినాశనకర ఎజెండాకు వ్యతిరేకంగా రైల్వే కార్మికులు నిరసించారు. ఇది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ఐక్యతతో ఇంకా ఉధతం అవుతుంది. అవసరమైతే సమ్మె కూడా చేస్తామని'' ఆయన 'న్యూస్ క్లిక్'తో అన్నాడు. దాదాపు 46 సంవత్సరాల క్రితం 1974లో రైల్వే సమ్మె పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా ఇన్స్యూరెన్స్, డిఫెన్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, టెలికాం రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి వారి కార్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, కోవిడ్-19 సంబంధిత అడ్డంకుల తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ వైపు దృష్టి మరల్చింది. మే నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ'లో భాగంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థల పాలసీ కింద వ్యూహాత్మక రంగాల్లో, ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రయివేటీకరిస్తున్నామని ప్రకటించింది. ఈ కొత్త పాలసీలో, బొగ్గు రంగంలో గనుల వ్యాపార విధానం, గనుల రంగంలో ప్రయివేటు పెట్టుబడులను పెంచాలన్న అంశాలను పొందుపరిచారు. ఈ చర్యల పట్ల పారిశ్రామిక నిపుణులు, కార్మిక సంఘాల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
శుక్రవారం నాటి దేశ వ్యాప్త నిరసన కార్యక్రమం మాదిరి గానే, (మూడు రోజుల సమ్మెలో భాగంగా) రెండవ రోజు నిరసన కార్యక్రమంలో కూడా 5.3లక్షల మంది బొగ్గు కార్మికులు (శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు) కనీసం 400 గనులలో, తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 75 పెద్ద సంస్థల్లో భాగస్వాములయ్యారు.
''ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అదీ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించని సమస్యపై ఇంత స్పందన రావడం మొదటిసారి'' అని సీఐటీయూ బలపరిచే 'ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్' ప్రధాన కార్యదర్శి డీ.డీ.రమానందన్ 'న్యూస్ క్లిక్'తో అన్నాడు. ఈ సమ్మె స్టీల్, ఆయిల్ ఫెడరేషన్స్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. నేటి నిరసన కార్యక్రమాలు మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ఎజెండాకు వ్యతిరేకంగా ఐక్య ఆందోళనల అవసరాన్ని నొక్కి చెప్పాయని ఆయన అన్నాడు.
అస్సాంలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్కు చెందిన డిగ్బోరు చమురు శుద్ధి కేంద్రం వద్ద, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్కు చెందిన అస్సామ్స్ సిల్చార్ వద్ద, ఇంకా త్రిపుర రాష్ట్రంలోని అగర్తాలలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లో పనిచేసే కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
''దేశాన్ని కరోనా మహమ్మారి దెబ్బ తీసిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే చర్యలు అన్యాయమైనవి. ఒకవైపు కేంద్రం చమురు ధరలు పెంచుతూ, మరొక వైపు చమురు కంపెనీలను ప్రయివేటీకరణ చేసేందుకు చర్చల్లో మునిగిపోతుంది. ఈ చమురు కంపెనీలను ప్రయివేటీకరణ చేసే నిర్ణయం చమురు రంగాన్ని భవిష్యత్తులో అదుపులేని రంగంగా మారుస్తుంది. చమురు కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఈ రెండు చర్యలకు వ్యతిరేకంగా ఉన్నారని'' 'పెట్రోలియం అండ్ గ్యాస్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' ప్రధాన కార్యదర్శి నోగిన్ చూటియా అన్నాడు.
కార్మిక చట్టాల్లో చేసిన మార్పులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేసిన నినాదాలతో దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలన్నీ మార్మోగిపోయాయి. కార్మిక సంఘాల నాయకత్వంలో హర్యానా రాష్ట్రంలోని మానెసార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పారిశ్రామిక కార్మికులు వందల సంఖ్యలో ఒక్కచోటే చేరి నగదు బదిలీ చేయాలని వారు చేసే డిమాండ్ను ఆలకించమని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (వీూవీజుర) ఘోరంగా దెబ్బ తీసింది. పెద్ద ఎత్తున వేతనాల కోతలు, మూకుమ్మడి నిరుద్యోగం ఇప్పుడు పారిశ్రామిక రంగంలోని ఈ సంస్థల్లో ఎక్కువగా ఉంది. ఈ మధ్యలోనే ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలు కార్మిక చట్టాల్లో కొన్నింటిని సడలించాయి. ఈ చట్టాల మార్పుతో పారిశ్రామిక కార్మికుల కష్టాలు మరింతగా పెరుగుతాయి.
ఈ నిరసన కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన అసంఘటితరంగ కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులు, వీధుల్లో తిరిగి అమ్ముకునే వారు కూడా భాగస్వాములయ్యారు. ''అనేక మంది బతుకు తెరువులు ఆధారపడి ఉన్న దేశ మూల స్తంభాలను కాపాడేందుకే ఈ పోరాటం. మోడీ ప్రభుత్వ విధానాలు స్వభావ రీత్యా పేద ప్రజలను మినహాయించేందుకు ఉద్దేశించబడినవి. ఈ విధానాలు పేదలు, అణగారిన వర్గాల వారిపైన ఘోరమైన ప్రభావాన్ని చూపుతాయి. అసంఘటిత రంగ కార్మికులు దీనిని అర్థం చేసుకొని, ముందుకు వచ్చి, ఆగ్రహంతో గొంతెత్తు తున్నారు'' అని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.కె.యస్.గౌతమ్ కార్మికుల నిరసన ప్రాధాన్యతను వివరించాడు.
నూట ముప్పై రైతు సంఘాల కలయికతో కూడిన 'ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ' కూడా శుక్రవారం నాటి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ''కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను చేసేందుకు ఈ లాక్డౌన్ను ఉపయోగించు కుంటుందని'' పేర్కొన్నది.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (A×Aఔఖ) నాయకత్వంలో పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని, ఉపాధిహామీ పథకం కింద చేసే పని రోజులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. కార్మికుల సమీకరణ సాధ్యం కాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆన్లైన్ బహిరంగ సభలు వేల మందితో నిర్వహించారు.
న్యూఢిల్లీలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు శ్రమశక్తి భవన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కేంద్ర కార్మిక అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి, సంతోష్ గంగ్వార్ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, అమర్ జిత్ కౌర్, ఇది కేవలం కార్మిక సంఘాల పోరాటమే కాదు, ఇది ''సామాన్య ప్రజల పోరాటం కూడా'' అని పేర్కొంది. ''మా విన్నపాలను ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ 'ఆత్మ నిర్భర్ భారత్' (స్వయం సమద్ధ భారత దేశం) గురించే మాట్లాడుతుంది, కానీ దానికి భిన్నంగా చేస్తుంది. ఒకవేళ అదే బాధ్యతారాహిత్యమైన స్వభావం కొనసాగితే, రానున్న కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని'' 'న్యూస్ క్లిక్' తో చెప్పింది.
'న్యూస్ క్లిక్' సౌజన్యంతో
రోనక్ చాబ్రా
అనువాదం: నీహాగౌతమ్,
సెల్: 9848412451