Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ విద్యా సంవత్సరానికిగాను 9-12 తరగతుల సీబీఎస్ఈ సిలబస్ను 30శాతం తగ్గిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ఇటీవల ప్రకటించారు. కోవిడ్ విపత్తు కారణంగా విద్యా సంస్థలు కోల్పోయిన పని దినాలను దష్టిలో పెట్టుకొని విద్యార్థులపై భారం లేకుండా 30శాతం సిలబస్ను తగ్గించాలని ఎన్సీ ఈఆర్టీ కూడా సూచించింది. దేశవ్యాప్తంగా సుమారు 1500మంది సిలబస్ను తగ్గించాలన్న అభిప్రాయాన్ని ఎంహెచ్ఆర్డీకి తెలియజేశారు. సిలబస్ తగ్గింపు సరేకాని వేటిని తొలగించాలి, ఎవరి అభిప్రాయాలు తీసు కున్నారు అనే ప్రక్రియలో పారదర్శకత లేదు. భావజాల దురుద్దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా సిలబస్ తగ్గింపు ఉండాలి. కాని తగ్గించిన సిలబస్ను గమనిస్తే ఆ లక్ష్యంతో చేసినట్టుగా లేదు. అవి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావజాలానికి ఏమాత్రం గిట్టనివి, ఎంపిక చేయబడ్డవిగా ఉన్నాయి. ఎప్పటి నుండో సిలబస్లో తాను చేయదలచుకున్న మార్పులకు భిన్నంగా, ఆటంకంగా ఉన్న పాఠ్యాంశాలనే ఇప్పుడు తీసేశారు. స్వాతంత్య్రానంతరం అన్ని ముఖ్యమైన విద్యా కమిషన్లు చెప్పిన, రాజ్యాంగ విలువలకు ప్రాతినిధ్యం వహించే పాఠ్యాంశాలన్నీ ఈ రద్దు జాబితాలో ఉన్నాయి. కోవిడ్ విపత్తును ఎదుర్కొనడం కాక దానిని అవకాశంగా మలుచుకొని సిలబస్లో తన ఎజెండా అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని అర్థమౌ తున్నది.
తొలగించిన భాగాల్లో ముఖ్యమైనవి
సమాఖ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, హక్కులు, ఉద్యమాలు, పౌరసత్వం, ఆహార భద్రత, జాతీయవాదం, స్థానిక ప్రభుత్వాలు, ప్రాంతీయ ఆకాంక్షలు, భద్రత, పర్యావరణం, సహజ వనరులు, ప్రణాళికాబద్ధమైన అభివద్ధి, పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ విదేశాంగ విధానం, ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు, భిన్నత్వంలో ఏకత్వం.. వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించారు. తీసివేసిన భాగాలన్నీ రాజ్యాంగ లక్ష్యాల సాధన, మన దేశ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలే. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రాథమికమైనవి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఇవిగాక కులం, మతం, లింగ వివక్ష, ప్రపంచీకరణ విధానాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీకి సంబంధించిన అంశాలనూ తొలగించారు. ఇవి పాలకుల వైఫల్యాలను తెలియచెప్పేవి కనక వాటిని తీసేశారు.
రాజకీయ ఎజెండా
విద్యా సంవత్సరం ప్రారంభించడానికి మానవ వనరుల మంత్రిత్వశాఖ తగిన కసరత్తు, ఏర్పాట్లు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు చేయాలి. అయితే ఆ పని కన్నా సిలబస్ తగ్గింపు మీద, ఆన్లైన్ విద్య పైన ఎక్కువ దష్టి సారించింది. విద్యా సంవత్సరం ప్రారంభ మయ్యాక ఉన్న పని దినాల ఆధారంగా సిలబస్ను కుదించవచ్చు. ఆ కుదింపు కూడా ఎంపిక చేయబడిన అంశాలనుకాక ర్యాండమ్గా చేయవచ్చు. అసలు తొలగించిన భాగాలు విద్యార్థులకు ఒత్తిడిని తగ్గిస్తాయా! రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలమా? తొలగించిన పాఠ్యాంశాలు విద్యార్థుల జీవితానికి, భవిష్యత్తుకు ఉపయోగ పడనివా? పోనీ మిగిలిన పాఠ్యాంశాలు తొలిగించిన వాటికన్నా ముఖ్యమైనవా? ఈ పాఠ్యాంశాలు బోధిస్తే ప్రస్తుతం మన దేశంలో అవి అమలవుతున్నాయో లేదో విద్యార్థులు తెలుసుకొని ప్రశ్నించే ప్రమాదముందనా? వీటిని బోధించకపోతే పాలకుల విధానాలకు ఎదురుండదనా? సిలబస్ను హేతుబద్ధీక రించామని మంత్రి గారు చెప్పడమంటే తొలగించిన పాఠ్యాంశాలు సహేతుకమైనవి కావని ఉద్దేశ్యమా? తదితర ప్రశ్నలకు ఎన్హెచ్ఆర్డీ దగ్గర సమాధానం లేదు. ఈ తొలగింపు ఈ విద్యా సంవత్సరానికే పరిమితమని, ఎన్సిఇఆర్టి రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా... తొలగించిన పాఠ్యాంశాలను కూడా అవసరం మేరకు బోధించవచ్చని ఎన్హెచ్ఆర్డీ చెప్పడం మరీ దారుణం. అంటే దేశ భవిష్యత్తుకు అవసరమైన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం వంటి రాజ్యాంగబద్ధ విలువల అవసరాన్ని ప్రశ్నార్ధకం చేయడమే ఇది. కుదింపు సామాజిక శాస్త్రాలలో మాత్రమే కాదని 190 సబ్జెక్టులలోనూ తగ్గించామని సీబీఎస్ఈ చెప్పడం సాంకేతికంగా తప్పుకోవడానికే తప్ప సమంజసమైనది కాదు. సీబీఎస్ఈ కిందటి విద్యా సంవత్సరంలో కూడా కులం, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, భిన్నత్వం మొదలైన పాఠ్యాంశాలనూ రద్దు చేసింది. విద్యార్థులకు సిలబస్ భారాన్ని తగ్గించాలనే పేరుతో విద్యా లక్ష్యాలకు తిలోదకాలు ఇవ్వడం సమంజసం కాదు. కరోనా వంటి విపత్కర పరిస్థితులకు 'జీవావరణ శాస్త్రం, పరిణామం'ను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయడమే కారణమని.. వీటికి సంబంధించిన పాఠ్యాంశా లను కూడా నేర్చుకోవలసిన ఈ సమయంలో తొలగించడమేమిటని 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్స్' సంస్థ ప్రశ్నిస్తోంది.
మరిన్ని మార్పులు
ఈ ప్రయత్నం కేవలం సీబీఎస్ఈకి మాత్రమే పరిమితం కాదు. కోవిడ్ విపత్తును అధిగమించేందుకు 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'లో భాగంగా ప్రకటించిన న్యూ నేషనల్ కరిక్యులమ్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ద్వారా సిలబస్లో, బోధనలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని చూస్తున్నది. నిజానికి బీజేపీ అధికారం చేపట్టిన చాలా రాష్ట్రాల్లో సిలబస్లను మార్పు చేసింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలచుకున్న 'జాతీయ విద్యా విధానం-2019' ద్వారా మొత్తం విద్యా వ్యవస్థను, దాని నిర్మాణాలను, సిలబస్, పాఠ్య ప్రణాళిక, బోధనలను రాజ్యాంగ విరుద్ధంగా మితవాద భావజాలం వైపు మళ్లించడానికి అనేక ప్రతిపాదనలు చేసింది. రాజ్యాంగ విలువలను, ఆధునిక విలువలను నీరుగార్చి ప్రాచీన భావనలను, విలువలను బోధించాలని ప్రతిపాదించింది. ప్రజాస్వామిక విలువలైన సమానత్వం, సమ న్యాయం, స్వాతంత్య్రం, లౌకికవాదం, సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కులు మొదలైనవి మన విద్యా వ్యవస్థలో కీలకమైన విలువలుగా ఉండాలని 'నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్-2005' చెప్పింది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నీతి, నైతిక విద్య పేరుతో మత విలువలను బోధించాలని ప్రతిపాదిస్తున్నది. పాఠశాల విద్యలో 6-8గ్రేడుల మధ్య విద్యార్థులకు ఒక సంవత్సరం కోర్సుగా దీనిని నిర్వహించాలని, స్వచ్ఛత, సేవ, మోసం, అహింస, సహాయం, సహనం, సత్యం, నిష్కామ కర్మ వంటి పాఠ్యాంశాలను బోధించాలని చెబుతున్నది. పంచతంత్ర, జాతక, హితోపదేశ కథలను బోధించి స్ఫూర్తినివ్వాలని చెబుతున్నది. న్యాయ విద్య కరిక్యులమ్ను రాజ్యాంగ విలువలను బట్టికాక ఇతిహాస కాల్పనిక విజయగాధల నుండి తయారు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఉన్నత విద్యలో ఉదారకళల విద్య పేరుతో 64కళల జ్ఞానాన్ని అందించాలని ప్రతిపాదిం చింది. ఎంపిక చేయబడిన కాలాల చరిత్రను, నాటి విలువలు, సంస్కతిని నేర్పాలంటుంది. అంటే భారతదేశ చరిత్ర, సంస్కతి, విలువలు, వారసత్వం మొదలైన వాటిని విమర్శనాత్మకమైన దక్పథం నుండి కాక ఒక గుడ్డి విశ్వాసంతో బోధించాలంటుంది. ఏకత, ఏకైక సంస్కతిని విద్యా వ్యవస్థ ద్వారా సాధించాలని చెబుతున్నది. అంటే ఇది మన దేశంలో ఉన్న బహుళ సంస్కతులను నిరాకరించడమే కదా? మితవాద భావాలను బోధించడం, వివక్షాపూరితమైన ప్రాచీన ఆచరణలను రుద్దడం లక్ష్యంగా కనిపిస్తుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పరిశోధన ప్రక్రియను కూడా మితవాద భావజాలం వైపు మళ్లించడానికి ప్రయత్ని స్తున్నది. దేశవ్యాప్తంగా సిలబస్ను ఎన్సీఈఆర్టీ రూపొందించాలని, రాష్ట్రాలు వాటికి కొంత జోడించుకోవచ్చని ప్రతిపాదిం చింది. అంటే సిలబస్ను పూర్తిగా మితవాద భావజాల కేంద్రంగా రూపొందించ మంటోంది. అంటే.. బీజేపీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన ఆధునిక విలువలనుగాక ప్రాచీన విలువల బోధన వైపు సిలబస్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. కోవిడ్ విపత్తును ఆసరాగా చేసుకొని రాజ్యాంగ విరుద్ధంగా సీబీఎస్ఈ సిలబస్ను కుందించి నట్లుగానే భవిష్యత్తులో అన్ని రకాల సిలబస్ల విషయంలో వ్యవహరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ప్రజాతంత్రవాదులు దీనిని తిప్పికొట్టాలి.
కె. శేషగిరి
సెల్: 8919394860