నవతెలంగాణ-డిచ్పల్లి
రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నాయకుడిగా జిల్లాలోనే కాకుండా కేంద్ర, రాష్ట్రాల్లో అనుకున్నది సాధించేవరకు పట్టు విడని విక్రమార్కుడిలా పేరు గాంచారు కేశ్పల్లి గడ్డం గంగారెడ్డి. జక్రాన్పల్లి మండలం, కేశ్పల్లి గ్రామంలో 1933 జూలై 12న జన్మించారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.
సర్పంచ్ నుంచి ఎంపీగా...
ప్రజాసేవే పరమావధిగా ఉద్యోగానికి రాజీనామ చేసి 1956లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి పడకల్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. వ్యాపారం నిర్వహిస్తు, వ్యవసాయం కూడా చేశారు. 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి, భారీ మెజారీటీతో గెలుపొందారు. అనంతరం 1998లో 12వ లోక్సభకు గెలుపొందారు. 1998-99లో పార్లమెంట్ అర్బన్ రూరల్ అభివృద్ధి కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి లోక్సభకు పోటీచేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఆయన సేవలను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా నియమించారు. 2004 వరకు ఎంపీగా ఉన్న అతను, 2004 శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పేర్కొనగా, ఆయన టికెట్ నిరాకరించారు. దీంతో అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరి డిచ్పల్లి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎమ్మె ల్యేగా గెలుపొందారు. 2008లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం వాకరి పదవులకు రాజీనామా చేశారు. దానిలో కేశ్పల్లి గంగారెడ్డి ఒకరు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో డిచ్పల్లి ఎమ్మెల్యేగా తన కుమారుడైన కేశ్పల్లి గడ్డం ఆనంద్రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో అప్పటి నుంచి నేటి వరకు ప్రత్యక్ష రాజకీయాలను ఆయన దూరంగా ఉండి తనయుడికి ఆవకాశం కల్పించారు.
జిల్లా అభివృద్ధికి కృషి
ఆయన ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నందున వీరి సౌకర్యార్థం ప్రధాని పీవీ నరసింహరావుతో మాట్లాడి పీఎఫ్ కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేశారు. అంతకు ముందు పీఎఫ్ కార్యాలయం లేనప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. జిల్లాలో కార్యాలయం ఏర్పాటయ్యాక ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. వీటికి కృషి వెనుక ఆయన శ్రమ దాగివుంది. డిచ్పల్లి మండలంలోని పది గ్రామాల్లోని చెరువులను నింపడానికి బర్ధిపూర్, డిచ్పల్లి లిఫ్ట్ ఏర్పాటుకు కృషి చేశారు.
గంగారెడ్డి చోరవతోనే బ్రాడ్గేజ్ నిర్మాణం..
గంగారెడ్డి ఎంపీగా ఉండి కృషి చేయడంతో సికింద్రాబాద్ నుంచి ముడ్కెడ్ వరకు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అంతకు ముందు ఉన్న మీటర్ గేజ్తో అనేక సమస్యలు ఉండేవి. రైళ్ల రాకపోకలు నెమ్మదిగా సాగేవి. ఈ దారిలో ఎక్కువ రైళ్లు వచ్చేవి కూడా కావు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రాడ్గేజ్ నిర్మాణం చేపట్టడానికి ఆయన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పెద్దపల్లి రైల్వే లైన్ నిజామాబాద్ వరకూ పొడగించాలని అప్పటి ప్రధానితో మాట్లాడి నిధులు రప్పించారు.
టీయూ ఆయన చోరవే....
డిచ్ పల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమ యంలో తెలం గాణ యూని వర్సిటీని జిల్లాకు రప్పించడానికి తీవ్ర స్థాయిలో ప్రయ త్నించి సఫలమ య్యారు. ఈ విష యంలో అప్పటి పీసీసీ చీఫ్, మంత్రి డీ శ్రీనివాస్ను ఎదురించి, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలను పోగు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డికి తెలంగాణ యూనివర్సిటీ నిర్మాణం డిచ్పల్లిలోనే చేపట్టాలని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. దీంతోపాటు డిచ్పల్లిలోనే 420కేవీ సబ్స్టేషన్ నిర్మాణం సైతం పూర్తిచేయించి, నాటి సీఎంతోనే ప్రారంభించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు ఆధునీకరణకోసం సీఎంను ఒప్పించి, నిధులు మంజూరు చేయించి, తనకంటూ ఒకప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. టీటీడీ మెంబర్గా మృతి చెందేవరకు ఆయన మాంసహారానికి , మద్యానికి దూరంగా ఉన్నారు.
కుటుంబ నేపథ్యం
ఆయనకు భార్య లకీëకాంతం, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు అహల్య రెడ్డి, శశికళరెడ్డి, అవనిజా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడైన కేశ్పల్లి గడ్డం ఆనంద్రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. చిన్నకు మారుడైన కేశ్పల్లి గడ్డం శ్రీనివాస్రెడ్డి వ్యాపారంలోనే స్థిరపడ్డారు.
2009 నుంచి రాజకీయాలకు దూరంగా..
2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రజలతో సత్సంబంధాలను కొనసా గిస్తున్నారు. ఆయన హామీనిచ్చిన మరుక్షణమే ఆ పనులు పూర్తిచేయించేవారని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు 90 ఏండ్లు వచ్చినా ఎవ్వరి సహాయం తీసుకోకుండానే ఉండేవారని, తన పనులు తాను చేసుకునేవారని పలువురు పేర్కొంటున్నారు.
ప్రధానులతో సత్సంబంధాలు
ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, కేవీగౌడ్, వాజ్పేరులతో సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర ముఖ్యమంత్రలు నందమూరి తారక రామారావు, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డికి వీరంటే ప్రత్యేక అభిమానం. వీరితో పాటు జిల్లాలోని సహచర మంత్రులతో, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలను కొనసాగిం చేవారు.
మెంట్రాజ్పల్లిలో నేడు అంత్యక్రియలు
జిల్లా ప్రజలతో పాటు ముఖ్యమంత్రులతో పాటు గుర్తింపు పొందిన నాయకుడు కేశ్పల్లి. అందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిం చడానికి అవసరమైతే తన సొంత డబ్బులను ఖర్చు పెట్టడానికి వెనుకాడని నేత అని పలువురు గుర్తు చేసు కుంటున్నారు. ఆయన మరణం తీరని లోటని పలువురు కొనియాడుతున్నారు. ఆయన అంత్య క్రియలను డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి పరిధిలో 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న తన ఫామ్హౌజ్లో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Authorization