- కలెక్టరేట్ ఎదుట బాధిత దళిత కుటుంబీకుల ధర్నా నవతెలంగాణ-కంఠేశ్వర్ కులబహిష్కరణ చేసిన కులస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామానికి చెందిన మాలకులస్తులైన కుటుంబ సభ్యులు సోమవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఇంటి పెద్ద గంగు మాట్లాడుతూ.. తమ కూతురు రమ్య ప్రేమ వివాహం చేసుకుందన్నారు. భర్త వేధించడంతో సంవత్సరంనుండి తమవద్దే ఉంటుందని తెలిపారు. ఈవిషయమై ఏప్రిల్లో కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించామన్నారు. భర్తపెట్టేబాధలను చెప్పి ఆయనతో ఉండలేనని న్యాయం చేయాలని తన కూతురు కోరిందని తెలిపారు. దీంతో కుల పెద్దలు రమ్యకు 80 వేలు జరిమానా విధించారన్నారు. దీనిపై స్థానిక పోలిస్టేషన్లో ఫిర్యాదు చేయగా జరిమానా కట్టొద్దని ఎస్ఐ తెలిపారన్నారు. దీంతో కుల పెద్దలు తమకుటుంబాన్ని కులంనుండి బహిష్కరించాని తెలిపారు. తమతో ఎవరూ మాట్లాడకూడదని తీర్మానించారని వాపోయారు. కులబహిష్కరణ చేసిన కులస్తులపై చర్యలు తీసుకోని తన కుటుంబానికి న్యాయం చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ రవీందర్కు వినతిపత్రం అందజేశారు.