- నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి - సీఐటీయూ కామారెడ్డి జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు నవతెలంగాణ-అశోక్నగర్ అంగన్వాడీకేంద్రాలకు సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ కామారెడ్డి జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు భారతి డిమాండ్చేశారు. ఐసీడీఎస్ద్వారా నేరుగా బియ్యం, పప్పలు, నూనె లాంటి సరుకులను ఇప్పటి వరకు సప్లరు చేసేవారని తెలిపారు. అంగన్వాడీసెంటర్లకు సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామనే నిర్ణయం సరికాదని అన్నారు. దీనివల్ల ఇబ్బందులకు తలెత్తుతాయని తెలిపారు. ఐసీడీఎస్ద్వారానే పంపిణీ చేయాలని డిమాండ్చేశారు. లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు.