నవతెలంగాణ-అశోక్నగర్ జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ ఎస్పీకి 9 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. కామారెడ్డి మండలం నుంచి నాలుగు, బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, నసురుల్లాబాద్, ఎల్లారెడ్డి నుంచి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదులు పోలీసుస్టేషన్కు పంపి ప్రజాసమస్యలు తొందరగా పరిష్కారం అయ్యేట్లు చొరువ చూపుతామని తెలిపారు.