నవతెలంగాణ-సదాశివనగర్ మండల కేంద్రంలో ఓ బాధితుడికి సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. మండల కేంద్రమైన మంగళి నర్సింలు ఆరోగ్యం బాగాలేదు. అతనికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి నిధి నుంచి 21,500 రూపాయల చెక్కు అందించినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో శివకుమార్, కమలాకర్రావు, బీరయ్య, సాయిలు, దేవరెడ్డి, సుభాష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.