నవతెలంగాణ-ఎల్లారెడ్డి రుబెల్లా టీకాలను తొమ్మిది నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికీ వేయించాలని మత్తమాల వైద్యురాలు దివ్య తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సాతెల్లి బేస్లో గల అంగన్వాడీ కేంద్రంలో ఆమె చిన్నారులకు టీకాలు వేశారు. ఇప్పటివరకు మండలంలోని రుద్రారం, మాచాపూర్, మత్తమాల, లింగారెడ్డి పేట అడివిలింగాల, గండి మాసానిపేట, వెల్లుట్ల , సోమార్పేట్, లక్ష్మాపూర్, కళ్యాణి, తిమ్మారెడ్డి తిమ్మాపూర్, సాతేల్లి, జంగమయిపల్లి, మీసంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లో టీకాలు వేశామని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 6,500 మంది విద్యార్థులకు టీకాలు వేసినట్లు ఆమె వివరించారు. గాంధారి : మండలంలోని దుర్గం గ్రామపంచాయతీ పరధిలో గల సోమారం తండాలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 84 మంది విద్యార్థులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు రమాకాంత్ రావు, సంజీవ్, ఆరోగ్య శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.