- అవస్థలు పడుతున్న గిరిజనులు నవతెలంగాణ-రామారెడ్డి ఘన్పూర్ వాగుపై ప్రారంభించిన బ్రిడ్జి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడు తున్నారు. మండలంలోని రెడ్డిపేట్ గ్రామపరిధిలో గల ఘన్పూర్ (ఆర్) తండాలో గత సంవత్సరం దాదాపు 36లక్షల రూపాయల నిధులతో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిం చారు. కాని బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో పక్కనే నిర్మించిన తాత్కాలిక మట్టిరోడ్డు వర్షాలకు బురదమయ మైంది. గిరిజనులు తాగునీరు కోసం ఇక్కడి వెళ్లాల్సి ఉంది. దీంతో వాహనదారులు ఎంతో మంది బురదలో పడిపోయిన ఘటనలున్నాయి. అధికారులు పనులను త్వరగా పూర్తిచేయిం చాలని తండావాసులు కోరుతున్నారు. మట్టిరోడ్డు బురదమయమైంది... మలావత్ బాల్య..... మా తండా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అర్ధాం తరంగా నిలిచిపోవడంతో పక్కనే గల మట్టిరోడ్డు బురదమయం అయింది. పాఠశా లకు వెళ్ళే మా పిల్లలు, పనులకు వెళ్లే మేము బురదలో జారి పడే పరిస్థితి ఉంది. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.