- తహసీల్దార్ వినయసాగర్ నవతెలంగాణ-రెంజల్ మండలంలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో రైతుల పహానీలను ఆన్లైన్లో నమోదు చేయాలని తహసీల్దార్ వినయసాగర్ వీఆర్వోలకు సూచించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ రెవెన్యూ అధికారులు సహకరించాలన్నారు. ప్రతిరోజూ రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పలుమార్లు తమ పనులు వదులుకుని తిరుగుతున్నారని, గ్రామంలో రైతులందరితో సమావేశమై పహానీలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వోలు గంగాధర్రావు, లక్ష్మినర్స, భూమయ్య, సాయిలు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.