- తహసీల్దార్కు వినతి నవతెలంగాణ-మద్నూర్ డబుల్ బెడ్రూంల కోసం నిరుపేదలు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దాార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా నాయకులు సందూరివారి శంకర్ మాట్లాడుతూ.. నిరుపేదలు ఏండ్ల తరబడి అద్దె ఇండ్లల్లో నివసిస్తున్నారని తెలిపారు. డబల్ బెడ్రూంలను అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఈ మండలంలో ఎక్కడ కొనసాగడం లేదని డబుల్ బెడ్రూంల ఇండ్ల కోసం సోమవారం నాడు మద్నూర్, తలబక్తూర్,లచ్చన్, చిన్నతడ్గూర్, పెద్దతడ్గూర్ తదితర గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూంలను మంజూరు చేయాలని 60 దరఖాస్తులను తహసీల్దార్కు అందజేశారు. కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ నాయకులు నగేష్, కిషన్, బాలాజీ, మహిళలు పాల్గొన్నారు.