- దుకాణాదారులకు నోటీసులందజేత నవతెలంగాణ-బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో చుట్టూ పక్కల దుకాణదారులు చెత్త వేసి దుర్గందంగా తయరుచేస్తున్నారని, చెత్తవేస్తే జరిమానా విధిస్తామని దుకాణ దారులకు సోమవారం అధికారులు నోటీసులు అందజేశారు. బస్టాండ్ ప్రాంతంలోని చెత్త తొలిగించి శుభ్రం చేయించారు. అనంతపురం ఎమ్డీవో సాయిబాబా మాట్లాడుతూ చుట్టూ పక్కల దుకాణ సముదాయాలు ఉండటంతో వారు చెత్త బస్టాండ్లో వేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ గోవర్దన్, మండల విద్యాధికారి బాబూరావు, గ్రామ సర్పంచ్ అశోక్, కార్యదర్శి జీవన్ సిబ్బంది ఉన్నారు.