నవతెలంగాణ-బోధన్ రూరల్ ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాల కోసం నూతన భవనం నిర్మించాలని పడీఎస్యూ నాయకులు సోమవారం ఆర్జేడీ సుహసినికి వినతి పత్రం అందించారు. మధుమలాంచ కళాశాలలో ఆకస్మిక తనిఖీ కోసం ఆర్జేడీ రావడంతో నాయకులు ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మున్సిపల్ కాంప్లెక్స్్ లో నిర్వహిస్తున్న బిల్డింగ్లో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, విద్యార్థుల సౌకర్యార్థం భవనం నిర్మించాలని వారు కోరారు. ఆమెకు వినతిపత్రం అందించిన వారిలో శ్రీనివాస్, గౌతంకుమార్, ఆకాశ్, సుమన్, మున్వర్ ఉన్నారు.