కులవృత్తుల నమీకరణకు..శిక్షణాకేంద్రాలు ఏర్పాటు చేయాలి
- విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహనచారి నవతెలంగాణ-రెంజల్ విశ్వబ్రాహ్మణుల వృత్తుల సమీకరణలో భాగంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహనచారి కోరారు. సోమవారం మండలంలోని మున్నూరు కాపు సంఘంలో మండలస్థాయి సమావేశం నిర్వహించారు. విశ్వబ్రాహ్మ ణులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం 200కోట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం 18 డిమాండ్లతో పోరాడగా ఇప్పటికే ఆరు డిమాండ్లు సాధించుకున్నామన్నారు. 50ఏండ్లు పైబడిన విశ్వబ్రాహ్మణులకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు నరహరచారి, స్థానిక నాయకులు రవి, వేణు, లింగం, కృష్ణ, భోజేందర్ తదితరులు పాల్గొన్నారు.