- అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలి : మండల కో ఆర్డినేటర్ శ్రీనివాస్ నవతెలంగాణ-బోధన్ రూరల్ సెప్టెంబర్ 8న నిర్వహించే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లోని వయోజన విద్యా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామ కో ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. వయోజన విద్యా కేంద్రాల్లో కథల పుస్తకాలు క్రమపద్ధతిలో వేలాడదీయాలని, ఉదయం, సాయంత్రం కేంద్రాన్ని తెరిచి ఉంచాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా గ్రామాలలో మహిళలతో ర్యాలీలు నిర్వహిం చాలని సూచించారు. అదే విధంగా సమవేశంలో వివిధ గ్రామాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.