- బోధన్ రూరల్ సీఐ గోవర్ధనగిరి
నవతెలంగాణ-రెంజల్
మండలంలో ప్రశాంత వాతావరణంలో పండగను జరుపుకోవాలని బోధన్ రూరల్ సీఐ గోవర్ధనగిరి అన్నారు. సోమవారం రెంజల్ మండలం నీల గ్రామంలో నిర్వహించిన శాంతికమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకచవితి, బక్రీద్ పండగలు ఒకదానితర్వాత ఒకటి రావడంతో శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని సూచించారు. గ్రామంలోని సార్వజనిక్ గణేష్ మండలి కమిటీ సభ్యులతో చర్చించారు. గ్రామంలోని వినాయక మండపాల్లో సౌండ్ బాక్సులు ఉంచొద్దని చెప్పడంతో స్థానిక యువకులు సౌండ్ బాక్సులకు అనుమతులివ్వాలని కోరారు. పోలీస్శాఖ డీజేలను నిషేధించగా కనీసం సౌండ్ బాక్సులైనా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని యువత కోరగా పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్తగా అదనపు బలగాలను నియమించామని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు పోలీసులకు సహకరించాలన్నారు. ఆయన వెంట ఎస్ఐ ప్రభాకర్, ఏఎస్ఐ రఫీయోద్దీన్, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పొతంగల్లో...
కోటగిరి:మండలంలోని పొతంగల్ గ్రామంలో సోమవారం శాంతికమిటీ సమావేశాన్ని సీఐ శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహించారు. వినాయకమండపాల నిర్వాహకులు ఓర్పుతో పండగ జరుపుకోవాలని, డీజేలకు అనుమతి తీసుకోవాలని, లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తిభావంతో, సోదరభావంతో పండగ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బషీర్అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు విఠల్, గ్రామపెద్దలు అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Authorization