- ఆయకట్టు రైతులను ఆదుకోవాలి - మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి - ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్శన నవతెలంగాణ-మెండోరా లక్ష్మి కాలువకు నీటిని విడుదల చేసి, ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని పోచంపాడ్ గ్రామంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 1070 అడుగుల నీరు చేరడంతో లక్ష్మి కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలన్నారు. ప్రాజెక్టులో 1066 అడుగులకు పైగా నీరు ఉంటే, నీటిని విడుదల చేయాల్సి ఉన్నా, ఎందుకు విడుదల చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నాగంపేట్ ముత్తన్న, సర్పంచ్ వాణి రమేష్, బద్దం నడ్పన్న, జక్క రాజేశ్వర్, బుస్సాపూర్ శ్రీను, కాంగ్రెస్ నాయకులున్నారు.