నవతెలంగాణ-భీంగల్ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు విద్యార్థులు మరింత ముందుకు వెళతారని చెప్పారు. వసతిగృహాల్లోని విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ చిరంజీవులు, ప్రధానోపాధ్యాయుడు రవీందర్, కళాశాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.