- సీపీఐ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు నవతెలంగాణ-ఆర్మూర్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శైలజకు సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చినా ఫలితం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాబురావు, అర్జున్, నర్సయ్య, అశోక్, జగన్, వెంకటేశ్ తదితరులున్నారు.