నవతెలంగాణ-డిచ్పల్లి మండలంలోని గ్రామ సమీపాన ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ఎంపీపీ దాసరి ఇందిరా లక్ష్మి నర్సయ్య, ఎంపీడీవో సురేందర్, టీఆర్ఎస్ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్స్టేషన్ను ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సబ్స్టేషన్తో పాటు స్మశాన వాటిక, కమ్యూనిటీ భవనాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు వారు తెలిపారు. వారి వెంట నాయకులు సర్పంచ్ భూమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, నర్సయ్య, నడిపన్న తదితరులు పాల్గొన్నారు.