నవతెలంగాణ-సిరికొండ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇందుకోసం సెప్టెంబర్ 1న పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లు కలిసి సామూహిక సెలవు మంజూరి చేయాలని ఎంపీడీవో శ్రీనివాసరావుకు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కార్యదర్శులు మాట్లాడుతూ.. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇందుకోసం సామూహిక సెలవు పెడుతున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నవీన్, నరేందర్, శ్రీనివాస్, దయానంద్, లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.