నవతెలంగాణ-డిచ్పల్లి/కమ్మర్పల్లి/మెండోరా
9 నెలల నుంచి 15ఏండ్లలోపు పిల్లలకు మీజిల్స్, రుబెల్లా టీకాలను తప్పనిసరిగా వేయించాలని డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో తుకారాం రాథోడ్ అన్నారు. మండలంలోని ధర్మారం(బీ), డిచ్పల్లి స్టేషన్ మండల కేంద్రంతో పాటు ఉర్దూమీడియం ఉన్నత పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ప్రయివేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎంఆర్ టీకాలను వేసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్ సోమనాథ్, సూపర్వైజర్ కిషన్, ఏఎన్ఎం లలిత, వెంకటేశ్, అర్చన, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వైద్యసిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి : ఎమ్మార్ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రధానోపాధ్యాయుడు మనోహర్ అన్నారు. సోమవారం మండలంలోని కోనాసముందర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మార్ టీకాలు వేశారు. కార్యక్రమాన్ని విద్యా కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, టీిఆర్ఎస్ నాయకులు సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు గోదావరి, అనవాల, హెల్త్ అసిస్టెంట్ మోహన్, టీిఆర్ఎస్ నాయకులు శేఖర్, అహ్మద్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులున్నారు.
మెండోరా : ముప్కాల్ మండల కేంద్రంలోని రెంజర్ల్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంఆర్ టీకాలపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు టీకాలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షేక్ హుస్సేన్, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్, మేరమ్మ, మారుతి, ఎస్వీవో మురళి, తదితరులు పాల్గొన్నారు.
Authorization