- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
- మంథని గ్రామ సందర్శన
నవతెలంగాణ-ఆర్మూర్
రాష్ట్ర ప్రభుత్వం వీడీసీల వ్యవస్థను రద్దుచేయాలని ఎమ్మార్పీఎస్ ్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్చేశారు. మండలంలోని మంథని గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీడీసీల పెత్తనం పెరిగిపోయిందన్నారు. గ్రామపంచాయతీ అధికారాలను తుంగలో తొక్కుతూ వీడీసీలు అధికారం చెలాయిస్తున్నారన్నారు. వీడీసీలు దళితులను సాంఘిక చేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు. సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు, పోలీసులు గ్రామాలను సందర్శించి బహిష్కరణ లేదని కితానిస్తున్నారని, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. ఈవిషయాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దళిత ప్రతినిధులు ముందుకు పోకుండా వీడీసీలు అడ్డుకుంటున్నారన్నారు. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దళితులను ఐక్యంచేస్తామని తెలిపారు. దామోదర్రెడ్డి దళితులకు విరాళంగా ఇచ్చిన భూములను వారికే చెందేలా పట్టాలిచ్చేవిధంగా చూడాలని అన్నారు. పలువురు దళితులు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంట పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు తెడ్డురవికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, జిల్లా అద్యక్షుడు మందకుమార్, జడ్పీటీసీ సాందన్న, మాజీ జడ్పీటీసీ గంటసదానందం, జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, యువసేన జిల్లా ఇన్చార్జి మైలారం బాలు, ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు సురేష్, పోలిట్బ్యూరో సభ్యులు తెడ్డుగంగారాం, దళిత నాయకులు పాల్గొన్నారు.
Authorization