నవతెలంగాణ-బోధన్ రూరల్ బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో మురుగు కాలువలు నిండిపోయి అపరిశుభ్రంగా తయ్యార య్యాయని, దీంతో దోమలు విపరీతంగా పెరిగాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనని యూత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో సబ్కలెక్టర్ సిక్తాపట్నా యక్కు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని, చీకటి ఆవరించిందని, చెత్త సేకరణ కోసం తెచ్చిన ట్రై సైకిళ్లు ఉపయోగిం చకపోవడం వలన వృథాగా పడి ఉన్నాయని తెలిపారు. ఇన్ని సమస్య లున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని పేర్కొ న్నారు. అధికా రులు స్పందించి గ్రామంలోని సమస్య లను పరిష్కరిం చాలని వారు కోరారు.