- ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.గంగాధరప్ప
నవతెలంగాణ-కంఠేశ్వర్/అశోక్నగర్
అమరుల స్ఫూర్తితో ప్రపంచీకరణ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గంగా ధరప్ప పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ విధానాల ఫలితంగా విద్యుత్ రంగాన్ని ప్రయివే టీకరిస్తూ పాలకవర్గాలు తీసుకున్న నిర్ణయాల ను నిరసిస్తూ సాగిన ఉద్యమంలో అమరులైన విద్యుత్ పోరాట అమరవీరులు విష్ణువర్ధన్, రా మకృష్ణ, బాలస్వామిల 17వ వర్థంతి సందర్భం గా నిజామాబాద్ నగరంలోని సీపీఐ(ఎం) నాందేవ్వాడలోని పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.గంగాధరప్ప మాట్లాడుతూ 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునా యుడు ప్రపంచబ్యాంకు ఆదేశాల్లో భాగంగా విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు
తీసుకొస్తే దానిని ప్రతి ఘటి స్తూ జరిగిన ప్రజా ఉద్యమం లో ప్రభుత్వం ముగ్గురిని పొట్టన
పెట్టుకుం దని, వేలాది మందిని గాయాలపా ల్జేసిందని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రపంచీకరణ విధానాలను అవలంబి óస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు సైతం అవే విధానాలను అవలంబిస్తే వీరికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పెద్దివెంకట్రాములు, రమేష్ బాబు, నూర్జహాన్, నగర కార్యదర్శి మల్యాల గో వర్ధన్, నాయకులు కృష్ణ, ఆనంద్, సుజాత, రాజయ్య ఉన్నారు.
కామారెడ్డిలో..
విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారి వర్థంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో అమరుల చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీసీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ చార్జిలను పెంచిందని, దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ చార్జీలను తగ్గించకపోవడంతో చలో అసెంబ్లీని ఆగస్టు 28న నిర్వహించగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలు, రైతులపై కాల్పులు జరిపిందని అన్నారు. ఈ ఘటనలో ముగ్గురు అమరులయ్యారని అన్నారు. తర్వాత ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాపోరాటలు నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంభిస్తోందని, ఈ ధోరణిని మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి కట్ల భూమన్న మాట్లాడుతూ ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గి విద్యుత్ చార్జీలను పేంచితే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. ఈ ఉద్యమంలో తర్వాత ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దీన్ని విస్మరించొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోతిరాం నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్కుమార్, పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి విఠల్ వివిధ పార్టీ నాయకులు మంద శ్రీను, లింబ్యా, రవి తదితరులు ఉన్నారు.
Authorization