- టీఎస్యూటీఎఫ్ అ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు, స్పెషల్ ఆఫీసర్, బోధనేతర సిబ్బంది సమస్య లు పరిష్కరించడంలో ప్రభుత్వం వివక్ష చూపడ ం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, సత్యానంద్ అన్నారు. కేజీబీవీ టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరి ంచాలని టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమ వారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. గతంలో పలుమార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కరించలేదన్నారు. 10వ పీఆర్సీ ప్రకారం టీచర్లు, ఆఫీసర్, ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఉచిత వైద్యంకోసం హెల్త్ కార్డులు జారీ చేయాలని, టీచర్లు, స్పెషల్ ఆఫీసర్, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇంచార్జి కలెక్టర్ రవీందర్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంగాధర్, శకుంతల, జిల్లా కార్యదర్శులు సాయన్న, బాల్రాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Authorization