నవతెలంగాణ-కమ్మర్పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్భ గాంధీ బాలికల పాఠశాలకు చెందిన యం.వాణి జాతీయ స్థాయి సాప్ట్బాల్ పోటీలకు ఎంపికైనందుకు శనివారం జరగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు.అక్టోబర్ 10 నుండి 12 వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టాప్ట్బాల్ పోటీలు జరిగాయి.ఇందులో అండర్-14 విభాగంలో వాణి జిల్లా జట్టు తరపున పాల్గొని జట్టు ప్రథమ స్థానంలో నిలవడంతో కీలక పాత్ర పోషించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.2019,జనవరి 2వ తేది నుండి 6వ తేది వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్పూర్లో జరగనున్న 64వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. నేపథ్యంలో మండలానికి చెందిన విద్యార్థిని జాతీయ పోటీల్లో పాల్గొంటున్నందుకు మండల సమావేశంలో ఎంపిపి అధ్యక్షురాలు మలావత్ కౌసల్య,ఎంపిడివో యం.శ్రీనివాస్, ఎంఈవో ఆంద్రయ్య ప్రత్యేకంగా అభినందించారు.జాతీయ స్థాయిలో రాణించి మండలానికి,జిల్లాకు గొప్ప పేరు తీసుకు రావాలని ఎంపిపి ఆకాంక్షించారు.జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోనేందుకు శనివారం వాణి బయలు దేరుతున్నట్లు ప్రత్యేక అధికారిణి గంగామణి తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినిని,ఇందుకు కృషి చేసిన పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయు రాలిని పాఠశాల ఉపాధ్యాయబృందం సభ్యులు పుష్పగుచ్చం అందించి అభినందించారు.
Authorization