నవతెలంగాణ-డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య ఆధ్వర్యంలో శనివారం శిల్ప కళాకారుడు అనుమల్ల రామ్ గోపాల్ను కమాండెంట్ ఘనంగా సన్మానించారు. గత కొన్ని రోజుల క్రితం ఏడో బెటాలియన్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్తర ముఖ ద్వారానికి తలుపుల పైన అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దిన అనుమల్ల రామ్ గోపాల్ శిల్ప కళకు వన్నె తెచ్చారన్నారు.