నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి రామారెడ్డిలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని శనివారం జుక్కల్ శాసనసభసభ్యులు హనుమంత్ షిండే దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, మొక్కులు తీర్చు కున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సన్మానించి, స్వామివారికి జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందజేశారు. కాలభైరవ స్వామి జన్మదిన సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి చైర్మన్ గంజి సతీష్గుప్తా, ఆలయ కమిటీ కార్యనిర్వాహణాధికారి శ్రీ రామ్ రవీందర్ గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు బైండ్ల బైరయ్య, బానూరి సువర్ణ మధుసూదన్ రెడ్డి, నాయ కులు పడగల శ్రీనివాస్, పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.