నవతెలంగాణ-లింగంపేట్ లింగంపేట్ మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో శనివారం కంటివెలుగు కార్యక్రమం నిర్వహిం చాలని కంటి వైద్య నిపుణులు మమత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 193 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 33 మందికి కంటి అద్దాలను అందజేశా మని, అదే విధంగా సంబంధాలు అవసరమని గుర్తిం చామన్నారు. 23 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించామన్నారు. 41 మందికి కంటి సమస్య మందులను పంపించామన్నారు. అదే విధంగా ఐదుగురిని ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేశామన్నారు. వారం రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని అం దరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో యాదగిరి, యశోద, శ్రవణ్కుమార్, అనురాధ, రాజమణి, భాగ్యలక్ష్మి, రజిని, భాషా, అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు.