నవతెలంగాణ-కంఠేశ్వర్ లయన్స్ సహారా సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన శిబిరం నిర్వ హించారు. వలస కార్మికులు రెండు వందల మందికి అన్నదానాన్ని అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ఉదయ సూర్యభగవాన్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారని తెలిపారు. ఇనుకొండ మాచర్ల ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి మట్టి పని చేసుకుంటూ ఉన్న వారికి గుర్తించారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, రామారావు, ధనుంజయ రెడ్డి, శ్యాంసుందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.