- ఎస్ఐ పూర్ణేశ్వర్ నవతెలంగాణ-బీర్కూర్ మహిళల పట్ల ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని బీర్కూర్ ఎస్ఐ పూర్ణేశ్వర్ విద్యార్థులకు సూచించారు. బీర్కూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూఢనమ్మకాలు, షీటీమ్స్, ట్రాఫిక్ నియంత్రణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఇంట్లో మహిళలు ఉన్నారని, చెల్లి, అక్క, అమ్మ, తదితర భావాలతో ఆలోచించి మెలగాలని అన్నారు. అనం తరం షీటీం టోల్ ఫ్రీ బ్రోచర్ను విడుదల చేశారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో ర్యాగింగ్పై అవగాహన కల్పించి షీ టీమ్స్ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని కోరారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్ప డితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్య క్రమంలో విద్యార్థినులు,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.