నవతెలంగాణ-డిచ్పల్లి
తెలంగాణ యూనివర్సిటీకి చెందిన అన్ని బాలికల, బాలుర వసతి గహాలకు చీఫ్ వార్డెన్గా తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోని పాత బాలుర వసతి గహానికి అప్లైడ్ ఎకనామిక్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లను శనివారం నియమించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.బలరాములు నియామక ఉత్తర్వులను డాక్టర్ వెంకటేశ్వర్లకు అందజేశారు. డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు ఇదివరకు తెలంగాణ యూనివర్సిటీ కళాశాలకు ఉప ప్రధాన ఆచార్యులుగా పనిచేశారు. అంతేకాక అడ్మి షన్స్ డైరెక్టర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా, పొలిటికల్ సైన్స్ విభాగానికి పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా ఎన్ఎస్ఎస్ 1 యూనిట్ ప్రోగ్రాం అధికారిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకంతో చీఫ్ వార్డెన్ వార్డెన్ ఉత్తర్వులను ఇచ్చినందుకు డాక్టర్ వెంకటేశ్వర్లు ఇండ్రస్టీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పిసాంబయ్యకు రిజిస్ట్రార్రిజిస్ట్రార్ బాల రాములకు ప్రత్యేక క తజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వర్లు చీఫ్ వార్డెన్,వార్డేన్ గా పదవులు పొందినందుకు తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు ఆయనను అభినందించారు.
Authorization