నవతెలంగాణ-తాడ్వాయి మండల కేంద్రంలో ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో శనివారం ఎంపీడీవో లక్ష్మీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మండలం లోని అన్నీ గ్రామాల్లో కార్య దర్శులు, ఐకెేపీ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆసరా పెన్షన్లు కోసం 57 ఏండ్ల నుంచి 64 ఏండ్ల వయసు గల వారిని ఎంపిక చేసి 5 రోజుల్లోగా ఇంటింటి సర్వే నిర్వహించి నివేదిక త్వరలోనే సమర్పించాలని కోరారు. ఈ పతకం ఎంతో ప్రముఖమైందని దీనికి క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని కోరారు. అర్హులైన వారిని తప్పనిసరిగా ఎంపిక చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామా ల కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది ఈఓపీఆర్డీ నారా యణ, ఐకెేపీ అధికారులు పాల్గొన్నారు.