- నీరివ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్ నవతెలంగాణ-లింగంపేట్ లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి కింది కాలనీవాసులకు తాగు నీరు అందించాలని శనివారం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ నాయకులు సైదా గోని వెంకట్ మాట్లాడుతూ కాలనీలో వారం రోజులుగా తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులు తాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. మదర్ కింద పల్లి, ఇందిరానగర్, బీసీ కాలనీలో కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో 500 పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ తాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారు సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అనంతరం కాలనీ వాసులతో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి కాలనీవాసులకు తాగు నీరు అందిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాస్కర్ లక్ష్మీ కాలనీవాసులు తదితరులున్నారు.