- 26 దిచక్ర వాహనాలు స్వాధీనం నవతెలంగాణ-కంఠేశ్వర్ నగరంలోని మూడో పోలీస్స్టేషన్ పరిధిలోని పాము లబస్తీ కాలనీలో డీసీపీ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో 160 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 26 దిచక్రవాహనాలు, ఆటో, ట్రాలీ ఆటో, ఖ్వాలి స్, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీసీపీ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 10 పార్టీలను ఏర్పాటు చేసి దాదాపు 200 ఇండ్లను తనిఖీలు చేసినట్టు తెలిపారు. పరిచయం లేని వ్యక్తులకు, ఆధారాలు లేనివారికి ఇల్లు కిరాయికి ఇవ్వరాదని, కొత్త వ్యక్తి కనబడితే దగ్గరలోని పోలీస్వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఎవరూ తమ వాహనాలను ఇతరులకు ఇవ్వరాదని, ఇతరులు వాహనాలను తీసుకుని వెళ్లి నేరం చేస్తే వాహన యజమానిపై కేసు నమోదుచేయనున్నట్టు తెలిపారు. కార్డెన్సెర్చ్లో ప్రజలు పోలీసులకు సహకారాన్ని అందించారని తెలిపారు.