నవతెలంగాణ-రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో వ్యవసాయదారులకు, తాగునీటి కోసం వినియోగించే కాలు దుర్గంధంగా మారింది. స్థానిక హోటల్ వారు చెత్తచెదారాన్ని పడేయడంతో దుర్గంధంగా మారిందని స్థానికులు అంటున్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే సాగునీరు రైతులకు ఈ కాలువ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం హోటళ్లలోని చెత్తచెదారాన్ని కాలువలో పడవేయడంతో దుర్గంధంగా మారి పందులకు నిలయంగా మారిరది. నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలో మురికి కలువకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.