నవతెలంగాణ-మద్నూర్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే హన్మంత్షిండేకు పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే చిత్రపటాన్ని శనివారం బహుకరించారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరైన ఎమ్మెల్యేకు పాఠశాలలో పనిచేసే బాలు అనే ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే చిత్రపటాన్ని పెన్సిల్తో గీసి ఎమ్మెల్యేకు బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఎమ్మెల్యే హన్మంత్షిండే మూడోసారి గెలుపొంది పాఠశాలకు రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉపాధ్యాయుడు తన చిత్రపటాన్ని గీచి అందజేసినందుకు ఆయన ఉపాధ్యాయుడిని అభినందించారు.