నవతెలంగాణ-డిచ్పల్లి
తెలంగాణ యూనివర్శిటీలోని బిజినెస్ మేనేజ్మెంట్ విభా గంలో ఇద్దరు పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు సయ్యదరుక్సాన, సయ్యదఇక్రామలకు శనివారం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సమావేశపు హాలులో డాక్టరేటు అవార్డును ప్రధానం చేశారు. కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ పీఠాధిపతి ప్రొఫెసర్ యాదగిరి ఆధ్వర్యంలో బహిరంగ మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు విద్యార్థులిద్దరికి స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ హైదరాబాద్లోని పీఠాధిపతి ప్రొఫెసర్ బదియోద్దిహైమద్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. పీిహెచ్డీ పరిశోధక విద్యార్థి సయ్యదరుక్సాన మోటివేషన్ అండ్ లీడర్షిప్ ఇన్ సర్వీస్ సెక్టార్ ఏ స్టడీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ అనే అంశంపై సమర్పించిన సిద్దాంత గ్రంథంపై మౌఖిక పరీక్ష నిర్వహించారు. దీనికి జెఎన్టీయూ హైదరాబాదులోని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సింధూ ఎక్సాటర్నల్ ఎగ్జామినర్గా పాల్గొన్నారు. సిద్దాంత గ్రంథంపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థి సయ్యద ఇక్రామ మేనేజ్మెంట్ ప్రాక్టిసెస్ ఇన్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజేస్ ఏ సెలెక్ట్ స్టడీ అనే అంశంపై సమర్పించిన సిద్దాంత గ్రంథంపై మౌఖిక పరీక్ష నిర్వహించారు. జెఎన్టీయూ హైద్రాబాదులోని స్కూల్ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కు చెందిన డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రభుకుమార్ ఈ మౌఖిక పరీక్షకు ఎక్సాటర్నల్ ఎగ్జామినర్గా పాల్గొని పరిశోధకురాలిని గ్రంథంపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ కైసర్మహ్మద్, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, యూనివర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు.
Authorization