- కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి నవతెలంగాణ-బిచ్కుంద ప్రజల రక్షణ కోసమే పోలీసులున్నారని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. శనివారం మండల కేంద్రంలోని బద్రాల్ తాండలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొని అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 50 బైక్లను, రెండు కార్లను, మూడు ట్రాక్టర్లను, మూడు ఆటోలను సీజ్ చేశారు. నేరచరిత్ర కలిగిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, పెద్దకొడప్గల్, పిట్లం, మండలాలకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు ఉండడంతో చిన్న పిల్లల అపహరణ, ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. గట్టి నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలూ చోటుచేసుకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బిచ్కుంద, బాన్సువాడ సీఐలు నవీన్కుమార్, మదుసూదన్, ఆరు మండలాల ఎస్ఐలు నరేందర్, మజీద్ఉల్లా, అభీలాష్, నాగార్జున వర్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.