- రూ.10లక్షల ఆస్తి నష్టం నవతెలంగాణ-లింగంపేట్ మండలంలోని మోతే గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.10లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రాజేందర్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎవరూ లేదు. రాజేందర్ శుక్రవారం రాత్రి డీజిల్ కోసం కామారెడ్డి పట్టణానికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.లక్షా 50వేల నగదు, 15తులాల బంగారాం, 25 తులాల వెండి, 45 క్వింటాళ్ల పత్తి, వ్యవసాయ పనిముట్లు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. బాధితుడికి అండగా ఉంటా : ఎమ్మెల్యే సురేందర్ అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. శనివారం మోతే గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఏలేటి రాంరెడ్డి, తహసీల్దార్ రామేశ్వర్, మచ్చ భూమయ్య, మైపాల్, సుధాకర్, వీఆర్ఏ సాయిలు, రమేష్, మధుసూదన్రెడ్డి తదితరులున్నారు.