నవతెలంగాణ-బోధన్ బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన సాయి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు పద్మాసింగ్ పారాలీగల్ రాష్ట్రస్థాయి ఉత్తమ వాలంటీర్గా అవార్డును పొందినట్టు శనివారం తెలిపారు. గత కొన్ని నెలలుగా నిరుపేదలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయ సలహాలు అందిస్తూ వారికి సహకరించడం, పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తనకు ఈ అవార్డును ప్రధానం చేసినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పద్మాసింగ్కు పలువురు అభినందనలు తెలిపారు.