- జడ్పీటీసీ భాస్కర్రెడ్డి నవతెలంగాణ-వర్ని విద్యార్థి దశ ఎంతో కీలకమైందని జడ్పీటీసీ భాస్కర్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో కోటయ్యక్యాంప్ ప్రభుత్వ ఆదర్శ పాఠ శాల వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటూ ఆట ల్లోనూ రాణించాలని సూచించారు. విద్యార్థులు ఎన్నో మంచి విష యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఉపాధ్యా యులు బోధించే ప్రతి సబ్జెక్టును శ్రద్ధగా వింటే సులభంగా పాసవ వచ్చని తెలిపారు. అనంతరం ఏంఈవో శాంతకుమారి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే నేర్చుకుంటే భవిష్యత్తులో ఎదుగుతారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు జడ్పీ టీసీ భాస్కర్రెడ్డిని శాలువతో సన్మానించారు. విద్యార్థులకు బహుమ తులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేందర్, ఉపాధ్యా యులు, ఎంపీటీసీ పట్టెపు రాములు, పాఠశాల అధ్యక్షులు రెడ్డి, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.